ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్ సింగ్ కెరీర్ లోనే పెద్ద నెంబర్లు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రెండు వందల కోట్లను దాటే పనిలో ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో అందరూ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ ల గురించి మాట్లాడుకున్నారు కానీ బయటికి ఎక్కువ కనిపించకుండా యూత్ ని ఆకట్టుకుంటున్న హీరోయిన్ సారా అర్జున్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పట్టుమని ఇరవై సంవత్సరాలు కూడా లేని ఈ టీనేజ్ బ్యూటీ, వయసు పరంగా చిన్నదే అయినా రణ్వీర్ సింగ్ ప్రియురాలిగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.
నిజానికి సారా అర్జున్ వెనుక యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ ఎన్నో సంవత్సరాల నుంచే ఉంది. ఏడేళ్ల వయసులోనే విక్రమ్ నాన్నలో నటించి ప్రశంసలు దక్కించుకున్న సంగతి మూవీ లవర్స్ కు గుర్తుండే ఉంటుంది. రాజేంద్రప్రసాద్ దాగుడుమూతల దండాకోర్ లో ఆయన మనవరాలిగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి లీడ్ హీరోయిన్ గా నిత్యం హిందీ తమిళ సినిమాలు చేస్తూనే వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ లో చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ పాత్రలో తళుక్కున మెరిసింది తనే. ఇది చూశాకే ఆదిత్య ధార్ ఈమెను ఎంపిక చేసుకున్నారు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ కూడా ఆర్టిస్టే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేశాడు.
అన్నట్టు సారా అర్జున్ తెలుగులో కూడా డెబ్యూ చేయనుంది. గుణశేఖర్ దర్శకత్వంలో అందరూ కొత్త వాళ్ళతో రూపొందిన యూఫోరియాలో తనుంది. ఒక్కడు ద్వారా భూమికకు పెద్ద బ్రేక్ ఇచ్చినట్టు ఇప్పుడీ యూఫోరియాతో తనకు అలాంటి మలుపు దక్కుతుందని సారా అర్జున్ ఎదురు చూస్తోంది. ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతున్న ఈ యూత్ మూవీలో నటనకు ప్రాధాన్యం ఎక్కువ ఉండే పాత్రే ఇచ్చారట. చిన్న వయసులోనే దురంధర్ లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సారా అర్జున్ వయసు పెరిగే కొద్దీ సరైన అవకాశాలు దక్కించుకుంటే మాత్రం బాలీవుడ్లో దూసుకెళ్లిపోవచ్చు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…