అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ విడుదల చేసింది. ముందు నుంచి చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఫైనల్ గా ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47 అని ఫిక్స్ చేశారు. ఉపశీర్షికగా ఏకే 47 అని పెట్టడం ద్వారా ఏదో క్రైమ్ టచ్ ఉన్న క్లూ అయితే ఇచ్చారు. వినడానికి ఏదో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నాటి పేరులా అనిపిస్తున్నా స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కించడం త్రివిక్రమ్ స్టైల్. అల వైకుంఠపురములో టైంలో కూడా అచ్చం ఇలాగే జరిగింది. తర్వాత ఏమైందో తెలిసిందే.
త్రివిక్రమ్ మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. అతడు, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురం సరసన ఇప్పుడు ఆదర్శ కుటుంబం కూడా చేరనుంది. కేవలం ఎంటర్ టైన్మెంటే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించిన వైనం కనిపిస్తోంది. వెంకటేష్ ఎప్పటిలాగే కూల్ అండ్ స్మార్ట్ గా కనిపించగా ఇతర క్యాస్టింగ్ ఎవరిని రివీల్ చేయలేదు. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కన్ఫర్మ్ కాగా సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించబోతున్నట్టు సమాచారం. అయితే వీటిని అఫీషియల్ గా ఖరారు చేయలేదు. త్వరలోనే సరైన సమయం చూసి వీటిని రివీల్ చేసే అవకాశం ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ తర్వాత వెంకటేష్ పరుగులు పెట్టడం లేదు. నెలల తరబడి గ్యాప్ తీసుకుని మన శంకరవరప్రసాద్ గారులో స్పెషల్ క్యామియో చేశారు. దృశ్యం 3 రీమేక్ కు సంబంధించి ఇంకా సాలిడ్ అప్డేట్ రావాల్సి ఉంది. ఆదర్శ కుటుంబం సమ్మర్ రిలీజ్ అన్నారు కాబట్టి ఏప్రిల్ కంతా షూటింగ్ పూర్తయిపోతుంది. బడ్జెట్ పరంగా వందల కోట్లు డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు కనక టార్గెట్ ని చేరుకోవడం ఈజీనే. పెన్నుతో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ వెంకటేష్ కు ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి డైరెక్షన్ తో ఎలాంటి అద్భుతం చేస్తారో వేచి చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…