అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ విడుదల చేసింది. ముందు నుంచి చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఫైనల్ గా ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47 అని ఫిక్స్ చేశారు. ఉపశీర్షికగా ఏకే 47 అని పెట్టడం ద్వారా ఏదో క్రైమ్ టచ్ ఉన్న క్లూ అయితే ఇచ్చారు. వినడానికి ఏదో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నాటి పేరులా అనిపిస్తున్నా స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కించడం త్రివిక్రమ్ స్టైల్. అల వైకుంఠపురములో టైంలో కూడా అచ్చం ఇలాగే జరిగింది. తర్వాత ఏమైందో తెలిసిందే.
త్రివిక్రమ్ మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. అతడు, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురం సరసన ఇప్పుడు ఆదర్శ కుటుంబం కూడా చేరనుంది. కేవలం ఎంటర్ టైన్మెంటే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించిన వైనం కనిపిస్తోంది. వెంకటేష్ ఎప్పటిలాగే కూల్ అండ్ స్మార్ట్ గా కనిపించగా ఇతర క్యాస్టింగ్ ఎవరిని రివీల్ చేయలేదు. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కన్ఫర్మ్ కాగా సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించబోతున్నట్టు సమాచారం. అయితే వీటిని అఫీషియల్ గా ఖరారు చేయలేదు. త్వరలోనే సరైన సమయం చూసి వీటిని రివీల్ చేసే అవకాశం ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ తర్వాత వెంకటేష్ పరుగులు పెట్టడం లేదు. నెలల తరబడి గ్యాప్ తీసుకుని మన శంకరవరప్రసాద్ గారులో స్పెషల్ క్యామియో చేశారు. దృశ్యం 3 రీమేక్ కు సంబంధించి ఇంకా సాలిడ్ అప్డేట్ రావాల్సి ఉంది. ఆదర్శ కుటుంబం సమ్మర్ రిలీజ్ అన్నారు కాబట్టి ఏప్రిల్ కంతా షూటింగ్ పూర్తయిపోతుంది. బడ్జెట్ పరంగా వందల కోట్లు డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు కనక టార్గెట్ ని చేరుకోవడం ఈజీనే. పెన్నుతో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ వెంకటేష్ కు ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి డైరెక్షన్ తో ఎలాంటి అద్భుతం చేస్తారో వేచి చూడాలి.
This post was last modified on December 10, 2025 10:45 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…