అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ విడుదల చేసింది. ముందు నుంచి చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఫైనల్ గా ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47 అని ఫిక్స్ చేశారు. ఉపశీర్షికగా ఏకే 47 అని పెట్టడం ద్వారా ఏదో క్రైమ్ టచ్ ఉన్న క్లూ అయితే ఇచ్చారు. వినడానికి ఏదో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నాటి పేరులా అనిపిస్తున్నా స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కించడం త్రివిక్రమ్ స్టైల్. అల వైకుంఠపురములో టైంలో కూడా అచ్చం ఇలాగే జరిగింది. తర్వాత ఏమైందో తెలిసిందే.
త్రివిక్రమ్ మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. అతడు, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురం సరసన ఇప్పుడు ఆదర్శ కుటుంబం కూడా చేరనుంది. కేవలం ఎంటర్ టైన్మెంటే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించిన వైనం కనిపిస్తోంది. వెంకటేష్ ఎప్పటిలాగే కూల్ అండ్ స్మార్ట్ గా కనిపించగా ఇతర క్యాస్టింగ్ ఎవరిని రివీల్ చేయలేదు. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కన్ఫర్మ్ కాగా సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించబోతున్నట్టు సమాచారం. అయితే వీటిని అఫీషియల్ గా ఖరారు చేయలేదు. త్వరలోనే సరైన సమయం చూసి వీటిని రివీల్ చేసే అవకాశం ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ తర్వాత వెంకటేష్ పరుగులు పెట్టడం లేదు. నెలల తరబడి గ్యాప్ తీసుకుని మన శంకరవరప్రసాద్ గారులో స్పెషల్ క్యామియో చేశారు. దృశ్యం 3 రీమేక్ కు సంబంధించి ఇంకా సాలిడ్ అప్డేట్ రావాల్సి ఉంది. ఆదర్శ కుటుంబం సమ్మర్ రిలీజ్ అన్నారు కాబట్టి ఏప్రిల్ కంతా షూటింగ్ పూర్తయిపోతుంది. బడ్జెట్ పరంగా వందల కోట్లు డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు కనక టార్గెట్ ని చేరుకోవడం ఈజీనే. పెన్నుతో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ వెంకటేష్ కు ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి డైరెక్షన్ తో ఎలాంటి అద్భుతం చేస్తారో వేచి చూడాలి.
This post was last modified on December 10, 2025 10:45 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…