Movie News

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ఎన్నడూ లేనిది రజని దీని ప్రమోషన్ కోసం అరగంటకు పైగా ప్రత్యేకమైన వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. అది కూడా సినిమాలో వేసిన గెటప్ తో పాటు ఇవ్వడం అన్నింటి కన్నా పెద్ద ట్విస్టు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న రజనీకాంత్ ఒక పెద్ద బాంబు వేశారు. నరసింహ సీక్వెల్ చర్చల్లో ఉందని, నీలాంబరి పేరుతో తీసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. కానీ అర్థం కానీ విషయం ఏంటంటే క్లైమాక్స్ లోనే రమ్యకృష్ణ పోషించిన ఆ పాత్ర చనిపోయింది.

మరి ఇప్పుడు ఆ పేరుతోనే సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారేమో. కానీ నిజ జీవితంలో సౌందర్య బ్రతికిలేరు కాబట్టి ఆవిడ క్యారెక్టర్ కి ఏదో ఒక ముగింపు చూపించాలి. అలా కాకుండా నీలాంబరితో ఫ్రెష్ గా వేరే సబ్జెక్టుతో తీస్తామంటే జనాలు కనెక్ట్ కారు. పైగా దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్ మానేసి నటనకు పరిమితమయ్యారు. ఈ బాధ్యతను వేరేవాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. చూస్తుంటే రజని ఏదో ఫ్యాన్స్ కి కాస్త ఊపునిద్దామని ఆ మాట అన్నట్టు ఉంది కానీ నిజమయ్యే సూచనలు తక్కువే. రమ్యకృష్ణ ఎలాగూ ఉన్నారు కాబట్టి ఈ ప్లాన్ మంచిదే కానీ అంత గొప్పగా సీక్వెల్ వస్తుందన్న గ్యారెంటీ లేదు.

పడయప్ప ఇప్పటిదాకా ఏ ఓటిటికి అమ్మలేదు. ఆ మాట కూడా రజనీనే చెప్పారు. తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది కానీ తమిళ ప్రింట్ మాత్రం ఆన్ లైన్ లో లేదు. ఆ మధ్య వన్ టైం టెలికాస్ట్ కోసం సన్ టీవీ ఛానల్ కు హక్కులు అమ్మారు తప్పించి మళ్ళీ రిపీట్ చూద్దామన్నా ప్రేక్షకులకు ఆ ఛాన్స్ దొరకలేదు. నరసింహ కథ కూడా తనే రాశానని చెబుతున్న రజని ఇప్పుడీ రీ రిలీజ్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. యాభై సంవత్సరాల నట ప్రయాణం సందర్భంగా చేస్తున్న విడుదల కాబట్టి ఫ్యాన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రాండ్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. చూడాలి ఎలాంటి రికార్డులు వస్తాయో.

This post was last modified on December 8, 2025 10:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

1 hour ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

3 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

4 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

5 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

5 hours ago

పిఠాపురంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి పిచ్చి…

5 hours ago