ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి వచ్చింది. ఉదాహరణకు నిన్న హైదరాబాద్ బుకింగ్స్ చూస్తే ఒక్కసారిగా రణ్వీర్ సింగ్ మూవీకి అనూహ్యమైన పికప్ కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం. బాలయ్య కోసం రిజర్వ్ చేసిన స్క్రీన్లను మెల్లగా దురంధర్, ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయితో పాటు మళయాలం కలం కవల్ కు ఇచ్చేయడంతో వాటి ఆక్యుపెన్సీలు మెరుగయ్యాయి. ఇక దురంధర్ విషయానికి వస్తే ప్రీ రిలీజ్ ముందు వరకు దీని మీద ఆశించిన బజ్ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది.
దురంధర్ ఒక వర్గం ఆడియన్స్ బాగానే నచ్చేశాడు. మూడున్నర గంటల నిడివిలో రిపీట్ అనిపించే యాక్షన్ బ్లాక్స్, లవ్ ట్రాక్ లాంటివి మైనస్ గా నిలిచినా ఇంటెన్స్ ఫైట్స్, కీలక నటీనటుల పెర్ఫార్మన్స్, ప్రొడక్షన్ వేల్యూస్ జనాన్ని చివరిదాకా కూర్చునేలా చేస్తున్నాయి. చాలా మందికి వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. దర్శకుడు ఆదిత్య ధార్ చాప్టర్ల వారిగా కథనాన్ని నడిపించడంతో విపరీతమైన ల్యాగ్ అనిపించిన మాట వాస్తవం. ఇంటర్వెల్ కే రెండు గంటలు పట్టిందంట నెరేషన్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ అయితే తప్ప దురంధర్ ని ఆస్వాదించడం కష్టమనేలా ఉంది.
కథ విషయానికి ఇది ఎప్పుడూ చూడనిది కాదు. భారత్ ఇంటెలిజెన్స్ చీఫ్ పాకిస్థాన్ కుట్రలను ఛేదించడం కోసం పంజాబ్ జైల్లో ఉన్న ఒక కరుడుగట్టిన కుర్రాడిని ఆపరేషన్ దురంధర్ పేరుతో పంపిస్తాడు. అతను అక్కడికి వెళ్లి చేసే విధ్వంసమే మెయిన్ స్టోరీ. షోలే, అజయ్ దేవగన్ ఖయామత్ లాంటి ఎన్నో పాత సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్న ఆదిత్య ధార్ దానికి టెర్రరిజం, యానిమల్ తరహా అగ్రెసివ్ వయొలెన్స్ జోడించాడు. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉన్నప్పటికీ ఎడిటింగ్, ల్యాగ్ పెద్ద గుదిబండగా మారిన దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చి 16 విడుదల కానుంది. అది ఎంత నిడివి ఉంటుందో మరి.
This post was last modified on December 6, 2025 10:32 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…