బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో హఠాత్తుగా విడుదల ఆగిపోవడం ఒక్క అఖండ 2 విషయంలోనే జరిగింది. గతంలో నిప్పురవ్వ లాంటివి నిర్మాణంలో ఆలస్యం వల్ల ఫ్యాన్స్ ని ఎదురు చూసేలా చేశాయి తప్పించి తీరా విడుదల తేదీ రోజు పోస్ట్ పోన్ కాలేదు. థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన బాలయ్య మద్దతుదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 రావడం లేదనే అధికారిక ధ్రువీకరణ అర్ధరాత్రి వచ్చింది.
వాయిదా వెనుక బోలెడు నేపధ్యముందని ఫిలిం నగర్ టాక్. దూకుడు లాభాలు ఇచ్చినప్పటికీ ఎరోస్ సంస్థతో ఫైనాన్షియల్ లావాదేవీలకు సంబంధించిన క్లియరెన్స్ లు పెండింగ్ పెట్టడంతో పాటు, ఆగడుని డిస్ట్రిబ్యూట్ చేసిన ఎరోస్ కు దాని విషయంలోనే పలు బకాయిలు ఉన్నాయట. వీటికన్నా ముందు 1 నేనొక్కడినే తాలూకు ఇష్యూస్ అలాగే ఉండిపోయాయట. అయితే సర్కారు వారి పాట 14 రీల్స్ సోలో ప్రొడక్షన్ కాకపోవడం వల్లే అది చిక్కుల్లో పడలేదని సమాచారం. ఎట్టకేలకు అఖండ 2 పూర్తయ్యేదాకా ఎదురు చూసిన సదరు ఎరోస్ కంపెనీ సరిగ్గా విడుదల టైంలో చిక్కులు సృష్టించడం ఊహించని పరిణామం.
ఇది ఎంతవరకు నిజమనేది నిర్మాతలు బాహాటంగా ప్రకటిస్తారో లేదో కానీ మొత్తం ఫిలిం నగర్ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అఖండ 2 కోసం రాత్రికి రాత్రి కొందరు పెద్దలు రంగంలోకి దిగి పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికి అవి విఫలమయ్యాయట. ఇరవై ఎనిమిది కోట్లు చాలా పెద్ద మొత్తం కావడం వల్లే సాల్వ్ కాలేదని ఇన్ సైడ్ టాక్. మదరాసు హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చేదాకా అఖండ 2లో కదలిక ఉండకపోవచ్చు. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించుకుని డిసెంబర్ 12, 19 25 ఈ మూడు డేట్లలో ఒకటి లాక్ చేసుకునే పనిలో ప్రొడ్యూసర్లు బిజీగా ఉన్నారట.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…