ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా కన్ఫార్మ్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేది ఇంకా క్లారిటీ రాకపోయినా తారక్ నెక్ట్స్ మూవీ ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడితో అంటూ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో రూమర్లు వినిపిస్తున్నాయి.
‘రామ్ లీల’,‘భాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్ తీసిన బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం అలియా భట్తో ‘గంగూభాయ్ కతైవాడి’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్లో మొదలైన ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని భావించారు. అయితే లాక్డౌన్ ఎఫెక్ట్తో గంగూభాయ్ రావడం ఆలస్యం కావచ్చు.
ఈ సినిమా తర్వాత సంజయ్ లీలా భన్సాలీ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఓ పీరియాడిక్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తరహాలో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతుందని, బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్వీర్ సింగ్ నెగిటివ్ రోల్ చేస్తాడని కూడా టాక్.
అయితే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఎన్టీఆర్ మూవీ చేయబోతున్నాడని ఇలాగే వార్తలు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాగే ఎన్టీఆర్తో భన్సాలీ మూవీ కేవలం ఓ రూమర్ అంటూ కొట్టిపాడేస్తున్నారు టాలీవుడ్ జనాలు.
బాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో పనిచేయాలని వెయిట్ చేస్తుంటే… వారిని కాదని భన్సాలీ, ఎన్టీఆర్తో మూవీ చేస్తాడా? అని ప్రశ్నిస్తున్నారు బీటౌన్ జనాలు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్కి బాలీవుడ్లో వచ్చే క్రేజ్ను వాడుకునేందుకే భన్సాలీ ఈ ప్రాజెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
This post was last modified on May 2, 2020 5:34 pm
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…