తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు ఏదైనా పాత సినిమాల హిట్ సాంగ్స్ కొత్త చిత్రాల్లో వాడుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. మహా అయితే ఒరిజినల్ నిర్మాతను ఫోన్ లో అడగటం ద్వారానో లేదా ఒక లెటర్ పంపడం ద్వారానో ఫార్మాలిటీ పూర్తి చేసేవాళ్ళు. కొందరు అది కూడా లేకుండా నేరుగా వాడేసుకుని సొమ్ము చేసుకున్న దాఖలాలు వందల్లో ఉంటాయి. అల్లరి నరేష్ చేసిన స్పూఫ్ మూవీస్ అన్నీ తవ్వి తీస్తే బోలెడు బయటపడతాయి. కానీ రాజా తర్వాత ఈ వ్యవహారంలో బోలెడు మార్పులొస్తున్నాయి.
ఇకపై దర్శక నిర్మాతలు ఎవరైనా సరే పాత పాటలు వాడుకునే క్రమంలో ముందు కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో విధిగా చెక్ చేసుకుంటున్నారు. మ్యూజిక్ కంపెనీ, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, లిరిక్ రైటర్ ఇలా అన్ని కోణాల్లో విచారణ చేసుకుని ఆ తర్వాత ఎవరిని అడగాలో కనుక్కుని ఆ మేరకు ప్రొసీడ్ అవుతున్నారు. తాజాగా జరిగిన ఉదంతంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ సినిమాలకు గాను 50 లక్షలు అవుట్ అఫ్ కోర్ట్ సెటిల్ మెంట్ చేసుకున్నారు నిర్మాత. ఎంతలేదన్నా అరకోటి అంటే భారమే. అదనంగా లాయర్ ఖర్చులు లక్షల్లో ఉంటాయి. ఇదంతా బడ్జెట్ పరిధిని దాటిన వ్యయం.
ఇళయరాజా వల్ల మిగిలిన సంగీత దర్శకులు అలెర్ట్ అవుతున్నారట. ఇప్పటిదాకా ఇంత సీరియస్ గా ఈ ఇష్యూ మీద దృష్టి పెట్టిన వాళ్ళు లేరు. రెహమాన్, కీరవాణి, కోటి, దేవా తదితరులు రాజా లాగా న్యాయస్థానాలకు వెళ్లడం లేదు కానీ తమ స్వంత పాటల కాపీ రైట్స్ ఎవరైనా వాడుకుంటే అసలు నిర్మాతల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఏదైతేనేం ఎవరో ఒకరికి రాజా చేసిన యుద్ధం వరంగా మారుతోంది. 1996లో వచ్చిన ఒక సూపర్ హిట్ సాంగ్ వాడుకోవాలంటే ఒక తెలుగు నిర్మాతను మ్యూజిక్ కంపెనీ అడిగిన మొత్తం 25 లక్షలట. అర్ధమయ్యిందా ఇళయరాజా ప్రభావం ఏ స్థాయిలో పడిందో.
This post was last modified on December 4, 2025 2:46 pm
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…