తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు ఏదైనా పాత సినిమాల హిట్ సాంగ్స్ కొత్త చిత్రాల్లో వాడుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. మహా అయితే ఒరిజినల్ నిర్మాతను ఫోన్ లో అడగటం ద్వారానో లేదా ఒక లెటర్ పంపడం ద్వారానో ఫార్మాలిటీ పూర్తి చేసేవాళ్ళు. కొందరు అది కూడా లేకుండా నేరుగా వాడేసుకుని సొమ్ము చేసుకున్న దాఖలాలు వందల్లో ఉంటాయి. అల్లరి నరేష్ చేసిన స్పూఫ్ మూవీస్ అన్నీ తవ్వి తీస్తే బోలెడు బయటపడతాయి. కానీ రాజా తర్వాత ఈ వ్యవహారంలో బోలెడు మార్పులొస్తున్నాయి.
ఇకపై దర్శక నిర్మాతలు ఎవరైనా సరే పాత పాటలు వాడుకునే క్రమంలో ముందు కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో విధిగా చెక్ చేసుకుంటున్నారు. మ్యూజిక్ కంపెనీ, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, లిరిక్ రైటర్ ఇలా అన్ని కోణాల్లో విచారణ చేసుకుని ఆ తర్వాత ఎవరిని అడగాలో కనుక్కుని ఆ మేరకు ప్రొసీడ్ అవుతున్నారు. తాజాగా జరిగిన ఉదంతంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ సినిమాలకు గాను 50 లక్షలు అవుట్ అఫ్ కోర్ట్ సెటిల్ మెంట్ చేసుకున్నారు నిర్మాత. ఎంతలేదన్నా అరకోటి అంటే భారమే. అదనంగా లాయర్ ఖర్చులు లక్షల్లో ఉంటాయి. ఇదంతా బడ్జెట్ పరిధిని దాటిన వ్యయం.
ఇళయరాజా వల్ల మిగిలిన సంగీత దర్శకులు అలెర్ట్ అవుతున్నారట. ఇప్పటిదాకా ఇంత సీరియస్ గా ఈ ఇష్యూ మీద దృష్టి పెట్టిన వాళ్ళు లేరు. రెహమాన్, కీరవాణి, కోటి, దేవా తదితరులు రాజా లాగా న్యాయస్థానాలకు వెళ్లడం లేదు కానీ తమ స్వంత పాటల కాపీ రైట్స్ ఎవరైనా వాడుకుంటే అసలు నిర్మాతల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఏదైతేనేం ఎవరో ఒకరికి రాజా చేసిన యుద్ధం వరంగా మారుతోంది. 1996లో వచ్చిన ఒక సూపర్ హిట్ సాంగ్ వాడుకోవాలంటే ఒక తెలుగు నిర్మాతను మ్యూజిక్ కంపెనీ అడిగిన మొత్తం 25 లక్షలట. అర్ధమయ్యిందా ఇళయరాజా ప్రభావం ఏ స్థాయిలో పడిందో.
This post was last modified on December 4, 2025 2:46 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…