హనుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ సజ్జా. ఐతే ఈ రెండు చిత్రాలకు ముందు తేజ.. చిన్న చిన్న సినిమాలే చేశాడు. కెరీర్ ఆరంభంలో అతను అద్భుతం అనే సినిమా చేసిన సంగతి చాలామందికి గుర్తుండకపోవచ్చు. కరోనా టైంలో ఓటీటీలో నేరుగా విడుదలై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుందా సినిమా. అది ఒక కొరియన్ మూవీకి ఫ్రీమేక్.
మల్లిక్ రామ్ రూపొందించాడు. ఆ సినిమా విడుదలకు ముందు ఫిలిం చాంబర్లో ఒక వివాదం నడిచిన సంగతి ఇండస్ట్రీ జనాలకు తెలుసు. దాని గురించి ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తేజ సజ్జ పేరు చెప్పకుడా.. ఆ సినిమా నుంచి హీరో, ఎడిటర్ కలిసి 15 నిమిషాలకు పైగా నిడివి ఉన్న సీన్లు తీయించేశారని ఆయన చెప్పడం గమనార్హం.
తన నిర్మాణంలో రాబోతున్న కొత్త చిత్రం గోట్ ప్రెస్ మీట్లో చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయం బయటపెట్టారు. తన ప్రొడక్షన్లో వచ్చిన తొలి రెండు చిత్రాల్లో హీరో వేలు పెట్టారని ఆయన ఆరోపించారు. తొలి సినిమాను కరోనా వల్ల ఓటీటీలో రిలీజ్ చేశామని.. ఆ సినిమాకు ఫైనల్ రన్ టైం 2 గంటల 21 నిమిషాలని ఆయన చెప్పారు. అక్కడి లాక్ చేసి రీ రికార్డింగ్కు పంపితే.. మ్యూజిక్ డైరెక్టర్ రదన్ ఫోన్ చేసి రన్ టైం 2 గంటల 4 నిమిషాలే ఉందని చెప్పడంతో తాను షాకైనట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తర్వాత విషయం ఏంటా అని ఆరా తీస్తే.. హీరో, ఎడిటర్ కలిసి హీరోయిన్ సీన్లు 15 నిమిషాలకు పైగా లేపేశారని తెలిసిందన్నారు. తన మీద హీఓయిన్ డామినేషన్ ఉందనే ఉద్దేశంతో హీరో అలా చేశాడన్నారు. ఇది తన కూతురి సినిమా కావడంతో జీవిత రాజశేఖర్ సీరియస్ అయ్యారని.. ఈ ఇష్యూను ఫిలిం ఛాంబర్ వరకు తీసుకెళ్లారని.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పారు. ఇక గోట్ మూవీ ప్రమోషన్లకు హీరో సుడిగాలి సుధీర్ రాకపోవడం గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ..డైరెక్షన్ టీంతో ఆయనకు సమస్యలు ఉన్నాయని.. సుధీర్ అడిగిన బడ్జెట్ ఇచ్చి సినిమా పూర్తి చేయించమని.. ప్రమోషన్లకు రావాలని మీడియా ద్వారా ఆయన్ని కోరుతున్నామని చంద్రశేఖర్ అన్నారు.
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…