హనుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ సజ్జా. ఐతే ఈ రెండు చిత్రాలకు ముందు తేజ.. చిన్న చిన్న సినిమాలే చేశాడు. కెరీర్ ఆరంభంలో అతను అద్భుతం అనే సినిమా చేసిన సంగతి చాలామందికి గుర్తుండకపోవచ్చు. కరోనా టైంలో ఓటీటీలో నేరుగా విడుదలై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుందా సినిమా. అది ఒక కొరియన్ మూవీకి ఫ్రీమేక్.
మల్లిక్ రామ్ రూపొందించాడు. ఆ సినిమా విడుదలకు ముందు ఫిలిం చాంబర్లో ఒక వివాదం నడిచిన సంగతి ఇండస్ట్రీ జనాలకు తెలుసు. దాని గురించి ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తేజ సజ్జ పేరు చెప్పకుడా.. ఆ సినిమా నుంచి హీరో, ఎడిటర్ కలిసి 15 నిమిషాలకు పైగా నిడివి ఉన్న సీన్లు తీయించేశారని ఆయన చెప్పడం గమనార్హం.
తన నిర్మాణంలో రాబోతున్న కొత్త చిత్రం గోట్ ప్రెస్ మీట్లో చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయం బయటపెట్టారు. తన ప్రొడక్షన్లో వచ్చిన తొలి రెండు చిత్రాల్లో హీరో వేలు పెట్టారని ఆయన ఆరోపించారు. తొలి సినిమాను కరోనా వల్ల ఓటీటీలో రిలీజ్ చేశామని.. ఆ సినిమాకు ఫైనల్ రన్ టైం 2 గంటల 21 నిమిషాలని ఆయన చెప్పారు. అక్కడి లాక్ చేసి రీ రికార్డింగ్కు పంపితే.. మ్యూజిక్ డైరెక్టర్ రదన్ ఫోన్ చేసి రన్ టైం 2 గంటల 4 నిమిషాలే ఉందని చెప్పడంతో తాను షాకైనట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తర్వాత విషయం ఏంటా అని ఆరా తీస్తే.. హీరో, ఎడిటర్ కలిసి హీరోయిన్ సీన్లు 15 నిమిషాలకు పైగా లేపేశారని తెలిసిందన్నారు. తన మీద హీఓయిన్ డామినేషన్ ఉందనే ఉద్దేశంతో హీరో అలా చేశాడన్నారు. ఇది తన కూతురి సినిమా కావడంతో జీవిత రాజశేఖర్ సీరియస్ అయ్యారని.. ఈ ఇష్యూను ఫిలిం ఛాంబర్ వరకు తీసుకెళ్లారని.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పారు. ఇక గోట్ మూవీ ప్రమోషన్లకు హీరో సుడిగాలి సుధీర్ రాకపోవడం గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ..డైరెక్షన్ టీంతో ఆయనకు సమస్యలు ఉన్నాయని.. సుధీర్ అడిగిన బడ్జెట్ ఇచ్చి సినిమా పూర్తి చేయించమని.. ప్రమోషన్లకు రావాలని మీడియా ద్వారా ఆయన్ని కోరుతున్నామని చంద్రశేఖర్ అన్నారు.
This post was last modified on December 3, 2025 10:06 am
రేపు రాత్రి అఖండ 2 తాండవం ప్రీమియర్లతో బాలయ్య షో ప్రారంభం కానుంది. ఓజి తర్వాత మళ్ళీ అంత పెద్ద…
శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…
ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి…
ఏపీ సీఎం చంద్రబాబు తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలతో మమేకం అవుతుంటారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం పరదాలు…
భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు…