తెలుగు సోషల్ మీడియాకు నిన్నట్నుంచి ప్రధాన వార్త.. సమంత పెళ్లి వ్యవహారమే. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. కొన్నేళ్లకే అతడితో విభేదాలు వచ్చి విడాకులు తీసుకోవడం.. తర్వాత అనారోగ్యం పాలవడం.. అదే సమయంలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లాడడం.. రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో పడడం.. చివరికి అతణ్ని పెళ్లి చేసుకోవడం.. ఇలా వివిధ సందర్భాల్లో సామ్ గురించి సోషల్ మీడియా విస్తృతంగా చర్చిస్తూనే ఉంది.
కాగా ఇప్పుడు సమంత పెళ్లితో అన్ని వివాదాలకు తెరపడినట్లే.. ఇక ఎవరి జీవితం వారిది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అదే సమయంలో సమంత మీద సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తోంది ఒక వర్గం. ఆమె గురించి పెద్ద ఎత్తున నెగెటివ్ పోస్టులు పడుతుండడం గమనార్హం. నాగచైతన్య, సమంత విడిపోయినపుడు.. శోభితను చైతూ పెళ్లి చేసుకున్నపుడు.. అక్కినేని హీరో మీద సోషల్ మీడియాలో ఒక వర్గం విరుచుకుపడింది. చైతూ సమంతను మోసం చేశాడన్నట్లు.. ఈ వ్యవహారంలో సమంత బాధితురాలన్నట్లు అతడి మీద నిందలు వేశారు.
విడాకుల విషయమై సమంత బాధ పడుతుంటే.. అనారోగ్యంతో సతమతం అవుతుంటే.. చైతూ హాయిగా పెళ్లి చేసుకున్నాడంటూ అతడిపై మండిపడ్డారు. శోభితను పెళ్లి చేసుకోవడం కోసమే సమంత నుంచి విడిపోయాడని కూడా అతడిని నిందించారు. విడాకుల తర్వాత చైతూ ఎంతో హుందాగా వ్యవహరించినా.. కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పద్ధతిగా వివరించినా ఆ వర్గం అతణ్ని టార్గెట్ చేయడం ఆపలేదు.
ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల విడాకుల ప్రభావం తన మీద ఎలా పడిందో వివరిస్తూ.. విడాకుల నిర్ణయం ఒకటికి వందసార్లు ఆలోచించి తీసుకున్నదని చెప్పినా వాళ్లు అతడిపై విమర్శలు, ఆరోపణల్ని ఆపలేదు. ఐతే ఇప్పుడు సమంత పెళ్లి వెనుక ఏం జరిగిందో విశ్లేషిస్తూ.. చైతూ నుంచి విడాకులు తీసుకోవడానికి ముందే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్ చేసి రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడ్డ విషయాన్ని గుర్తు చేస్తూ ఎవరు ఎవరిని మోసం చేశారని ప్రశ్నిస్తున్నారు చైతూ మద్దతుదారులు. అప్పుడు చైతూ మీద అనేక నిందలు వేసి, అతణ్ని అదేపనిగా టార్గెట్ చేసిన వాళ్లంతా ఇప్పుడు అతడికి సారీ చెప్పాలని ఈ వర్గం డిమాండ్ చేస్తోంది.
This post was last modified on December 2, 2025 8:54 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…