టాలీవుడ్లో మరో ప్రముఖ పెళ్లికి రంగం సిద్ధమైంది. మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక ఈ నెల 9న చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు హైదరాబాద్ నుంచి రాజస్థాన్లోని ఉదయపూర్కు బయల్దేరాయి. అక్కడ ఉదయ్ విలాస్ అనే లగ్జరీ హోటల్లో నిహారిక, చైతన్యల పెళ్లి జరగబోతోంది.
ఉదయ్ పూర్కు బయల్దేరడానికి ముందు నిహారికను హైదరాబాద్లోని తన ఇంట్లో పెళ్లి కూతురిని చేశారు. సంప్రదాయబద్ధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు చిరు కుటుంబం కూడా హాజరైంది. ఆ వేడుక ముగించుకుని పెళ్లి కోసం చార్టెడ్ ఫ్లైట్లో వధువు, వరుడు, ఇరు కుటుంబాల ముఖ్య సభ్యులు ఉదయ్ పూర్కు బయల్దేరారు. ఉదయ్ పూర్కు చేరుకోగానే పెళ్లి తంతులో భాగం కాబోతున్న నాగబాబు.. దానికి ముందు ట్విట్టర్లో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు.
‘‘ఒక కుటుంబంగా మేం నీకు మూలాలు ఇచ్చాం. ఒక తండ్రిగా నీకు నేను రెక్కలు ఇచ్చా. ఆ రెక్కలు నిన్ను ఎంతో ఎత్తుకు ఎగిరే అవకాశాన్నిస్తాయి. ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ భద్రంగా ఉంచుతాయి. నీ ప్రియమైన తండ్రి నీకిచ్చిన ఉత్తమమైన బహుమతులు ఇవి’’ అని పేర్కొంటూ.. నిహారికను పెళ్లి కూతురిని చేసిన వేడుకలో ఆమెతో కలిసి తాను, తన భార్య, చిరంజీవి, సురేఖ కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు నాగబాబు.
కూతురిపై నాగబాబు ప్రేమ ఎలాంటిదో అనేక సందర్భాల్లో చూశాం. ఆ ముద్దుల కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నపుడు ఎంత ఉద్వేగం ఉంటుందో అర్థం చేసుకోగలం. ఆ ఉద్వేగాన్నే ట్విట్టర్లో చూపించారు నాగబాబు. ఇక పెళ్లి కోసం అతిథులందరూ కూడా ఈ రోజే ఉదయ్ పూర్కు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు వేడుకలు సాగుతాయి. అందరికీ కోవిడ్ పరీక్షలు చేశాకే పెళ్లికి అనుమతించబోతున్నారు.
This post was last modified on December 7, 2020 12:15 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…