మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ‘మగధీర’తో కెరీర్లో రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్, ‘రంగస్థలం’ సినిమాతో నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే చరణ్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ కాకుండా మెగాస్టార్ డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్స్టార్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. గెస్ట్ రోల్ అయినా సినిమాకి చెర్రీ పాత్ర కీలకం కానుందట. అయితే మెగా ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా చరణ్ కోసం రెండు స్పెషల్ సాంగ్స్ ఈ సినిమాలో ఇరికిస్తున్నాడట కొరటాల శివ.
చరణ్ డ్యాన్స్ చూద్దామని థియేటర్కి వచ్చే మెగాఫ్యాన్స్ కోసం ఊరమాస్ స్టెప్పులతో సాగే ఓ స్పెషల్ సాంగ్తో పాటు ఓ ఎమోషనల్ సాంగ్ కూడా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో నిహారిక కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. మరి చరణ్ ప్రక్కన హీరోయిన్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం వేచి చూడాల్సిన విషయమే.
లాక్డౌన్ కారణంగా గ్యాప్ తీసుకున్న ‘ఆచార్య’ చిత్ర యూనిట్, లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ మొదలెట్టి షరవేగంగా పూర్తిచేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ముందుగా దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నా, నెలకు పైగా బ్రేక్ రావడంతో సంక్రాంతి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on May 2, 2020 7:17 pm
తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…