మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ‘మగధీర’తో కెరీర్లో రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్, ‘రంగస్థలం’ సినిమాతో నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే చరణ్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ కాకుండా మెగాస్టార్ డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్స్టార్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. గెస్ట్ రోల్ అయినా సినిమాకి చెర్రీ పాత్ర కీలకం కానుందట. అయితే మెగా ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా చరణ్ కోసం రెండు స్పెషల్ సాంగ్స్ ఈ సినిమాలో ఇరికిస్తున్నాడట కొరటాల శివ.
చరణ్ డ్యాన్స్ చూద్దామని థియేటర్కి వచ్చే మెగాఫ్యాన్స్ కోసం ఊరమాస్ స్టెప్పులతో సాగే ఓ స్పెషల్ సాంగ్తో పాటు ఓ ఎమోషనల్ సాంగ్ కూడా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో నిహారిక కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. మరి చరణ్ ప్రక్కన హీరోయిన్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం వేచి చూడాల్సిన విషయమే.
లాక్డౌన్ కారణంగా గ్యాప్ తీసుకున్న ‘ఆచార్య’ చిత్ర యూనిట్, లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ మొదలెట్టి షరవేగంగా పూర్తిచేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ముందుగా దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నా, నెలకు పైగా బ్రేక్ రావడంతో సంక్రాంతి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on May 2, 2020 7:17 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…