బాలీవుడ్ బడా బాబుల్ని దీటుగా ఎదుర్కొంటూ, సంచలన వ్యాఖ్యలు చేస్తూ కంగనా రనౌత్ ఒకప్పుడు వీరనారిలా కనిపించేది జనాలకు. కానీ ఈ మధ్య కాలంలో ఆమె విమర్శలు, ఆరోపణలు శ్రుతి మించిపోయాయి. ప్రతి అంశంలోనూ వేలు పెట్టి అవతలి వాళ్లపై అభాండాలు వేయడం, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు అనుకూలంగా భజన చేయడం ద్వారా ఆమె విమర్శల పాలవుతోంది.
కొన్ని విషయాల్లో ఆమె అనవసర జోక్యం చాలామందిలో వ్యతిరేకత పెంచింది. ఇక సెలబ్రెటీల విషయానికొస్తే ఆమె నోటికి భయపడి చాలామంది తన జోలికి వెళ్లట్లేదు కానీ.. అప్పుడప్పుడూ కొందరు ఆమెను దీటుగా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్ చేరాడు.
మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల్లో కనిపించిన ఓ వృద్ధ మహిళ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలతో మండిపోయిన దిల్జిత్.. కంగనాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. పదునైన వ్యాఖ్యలతో ఆమెకు కక్కలేని మింగలేని పరిస్థితి కల్పించాడు. ఎప్పుడూ ఎదుటివారి మీద ఎదురు దాడి చేసే కంగనా.. దిల్జిత్కు సమాధానం చెప్పడంలో తడబడింది. ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో దిల్జిత్ సోషల్ మీడియా హీరో అయిపోయాడు. ఒక్కసారిగా అతను ట్విట్టర్లో ట్రెండ్ అయ్యాడు. సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. కంగనాతో పెట్టుకున్న కేవలం మూడు రోజుల్లోనే అతడి ఫాలోవర్ల సంఖ్య 5 లక్షలకు పైగా పెరిగిపోవడం విశేషం. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతోంది.
ఆందోళనల్లో పాల్గొన్న రైతులకు చలి కోట్లు కొనడం కోసం దిల్జిత్ కోటి రూపాయలు విరాళం ఇవ్వడం, దాని గురించి అతను ప్రచారం కూడా చేసుకోకపోవడం, వేరే వ్యక్తి ద్వారా ఆ విషయం వెల్లడి కావడం కూడా అతడి ఇమేజ్ను బాగా పెంచింది. ప్రస్తుతం అతడి పాలోవర్ల సంఖ్య 4.4 మిలియన్లు. అతి త్వరలోనే అది 5 మిలియన్ మార్కును అందుకునేలా కనిపిస్తోంది.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…