Movie News

రాజేంద్రుడికి చివరి ఛాన్స్ అయిపోయింది

సోషల్ మీడియా పుణ్యమా అని.. ఉద్దేశపూర్వకంగా అనని చిన్న చిన్న మాటలు కూడా పెద్ద వివాదానికి దారి తీస్తున్న రోజులు ఇవి. ఈ పరిస్థితుల్లో స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకునే వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆచితూచి మాట్లాడాల్సిందే. కానీ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మళ్లీ మళ్లీ అదుపు తప్పి మాట్లాడుతున్నారు. ఒకట్రెండు సార్లు అంటే పొరపాటు అనుకోవచ్చు. కానీ పదే పదే నోరు జారుతున్నారంటే ఆయనకేదో సమస్య అయినా ఉండుండాలి. లేదంటే.. లెక్కలేనితనం అయినా అయ్యుండాలి.

అవతలి వ్యక్తులతో తనకు ఎంత సాన్నిహిత్యం ఉన్నా సరే.. స్టేజ్ మీద వాళ్లనుద్దేశించి బూతులు మాట్లాడ్డం ఎంత మాత్రం సంస్కారం అనిపించుకోదు. గత ఏడాది లెజెండరీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి ‘రాబిన్ హుడ్’ ఈవెంట్లో ‘దొంగముండాకొడుకు వీడు’ అనడంతో మొదలైంది ఆయన బూతులు పర్వం. ఆ వ్యాఖ్యలకు తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు. సరదాగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు.

కట్ చేస్తే తర్వాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో మాట్లాడుతూ.. కమెడియన్ ఆలీని ఉద్దేశించి.. ‘లం..కొడుకు’ అనే బూతు మాట మాట్లాడ్డం మరింత వివాదాస్పదమైంది. ఆయన్ని సినిమా వేడుకలకు పిలవొద్దని.. పిలిచినా మైక్ ఇవ్వొద్దని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కానీ ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే మీ కర్మ’’ అంటూ తనను విమర్శించేవారి మీద ఎదురుదాడి చేశారు. పబ్లిక్ ఈవెంట్లో సంస్కారం తప్పి మాట్లాడి.. దాన్ని తప్పుబట్టిన వారికే సంస్కారం లేదన్నట్లుగా ఆయన కామెంట్ చేయడం విడ్డూరం.

ఈ మధ్య ‘మాస్ జాతర’ ఈవెంట్లో ఈ సినిమా షాక్ ఇవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా అంటూ అవసరం లేని మరో కామెంట్ చేశారు. ఆ కామెంట్ వల్ల వేరే వాళ్లెవ్వరూ ఇబ్బంది పడలేదు కాబట్టి ఓకే. కానీ తాజాగా తెలుగు వాళ్లందరూ అమితంగా ఇష్టపడే బ్రహ్మానందంను ఉద్దేశించి ‘‘ముసలి ముండా కొడుకు నువ్వు’’ అనడం మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ‘‘పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం’’ అంటూ ఆయన బ్రహ్మి గురించి ప్రస్తావించిన తీరు వ్యంగ్యంగా ఉండడమే కాక, ఆయనంటే ఏదో అసూయ ఉన్నట్లుగా అనిపించింది అందరికీ.

‘ముసలి ముండా కొడుకు..’ అంటూ బూతు మాట వాడి.. వెంటనే తప్పు చేశానని గ్రహించి ఆ మాట తనను తాను అనుకున్నట్లు కవర్ చేయబోయారు కానీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈసారి టార్గెట్ అయింది బ్రహ్మానందం కావడంతో రాజేంద్ర ప్రసాద్‌‌కు చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్లే. ఆయనకు రవ్వంత కూడా సానుభూతి రావట్లేదు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోవట్లేదు. చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఉన్న కాస్త గౌరవాన్ని కూడా ఈ రోజు పోగొట్టుకున్నారంటూ రాజేంద్రుడి మీద విరుచుకుపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ మీద అభిమానం ఉంటే ఆయన్ని ఈవెంట్లకు పిలవొద్దని.. పిలిచినా మైక్ ఇవ్వొద్దని నొక్కి వక్కాణిస్తున్నారు

Satya

Recent Posts

వ‌డ్డే న‌వీన్ అంత ప‌వ‌ర్ ఫుల్లా?

90వ ద‌శ‌కంలో మ‌న‌సిచ్చి చూడు.. చాలాబాగుంది స‌హా ప‌లు ఫ్యామిలీ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న న‌టుడు వ‌డ్డే నవీన్. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌ల…

1 hour ago

రిస్కు చేయడమే విలువను పెంచుతోంది

టాలీవుడ్ లో ఉన్న చాలా అగ్ర నిర్మాణ సంస్థలు బిజినెస్ లెక్కల ఆధారంగానే సినిమాలు తీస్తున్న మాట వాస్తవం. హీరో…

2 hours ago

మల్లు అర్జున్ క్రేజ్ చెక్కు చెదరలేదు

మనం తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి వాళ్ళను నెత్తినబెట్టుకుని చూస్తాం కానీ మనోళ్ళను వాళ్ళు పిచ్చ లైట్…

2 hours ago

లెనిన్ మళ్ళీ మాట తప్పితే ఎలా

మొన్నటిదాకా జూన్ 26 రావడం పక్కాని పదే పదే ప్రమోషన్లలో ఊదరగొట్టిన లెనిన్ మళ్ళీ వాయిదా పడిందనే వార్త అభిమానుల్లో…

2 hours ago

కోరుకున్న సినిమా వ‌చ్చింది… ఆద‌రిస్తారా?

తెలుగులో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు త‌క్కువ అని… కొత్త క‌థ‌లు ప్ర‌య‌త్నించ‌ర‌ని.. ఎప్పుడూ మాస్ మంత్ర‌మే ప‌ఠిస్తుంటార‌ని.. క‌థ‌ల‌న్నీ హీరోల చుట్టూనే…

3 hours ago

సత్యదేవ్ మరీ ఎక్కువ మాట్లాడేశాడా?

ఈ రోజుల్లో పెద్ద సినిమాల‌కే ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. అలాంట‌పుడు చిన్న స్థాయి సినిమాల‌ను జ‌నాల్లోకి…

4 hours ago