పూనమ్ కౌర్.. ఈ పేరు టాలీవుడ్ వర్గాల్లో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఐతే ఆమె వార్తల్లో నిలిచేది సినిమాకు సంబంధించిన అంశాలతో కాకపోవడమే ట్విస్టు. పంజాబీ అమ్మాయి అయిన పూనమ్ దశాబ్దం కిందట్నుంచి హైదరాబాద్లోనే ఉంటోంది. ఆమె చేసిన సినిమాలన్నీ చిన్నా చితకవే. వాటిలో కూడా కాస్తో కూస్తో ఆడినవి తక్కువే. కొన్నేళ్ల నుంచి పూనమ్ సినిమాల్లో కనిపించడం కూడా తగ్గిపోయింది. అయినా సరే.. సినిమాయేతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
పవన్ కళ్యాణ్తో ముడిపెట్టి ఆమె గురించి చర్చ పెడుతుంటారు జనాలు. ఆమె కూడా ఈ విషయంలో జనాలకున్న సందేహాలను మరింత పెంచేలా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటుంది. కొన్నిసార్లు ఆమె పవన్ కళ్యాణ్కు అనుకూలంగా కామెంట్లు చేస్తుంటుంది. కొన్నిసార్లేమో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటుంది. కౌంటర్లు వేస్తుంటుంది.
తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్తో ముడిపడ్డ ఓ అంశంపై ఆమె మాట్లాడింది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల గురించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆ వ్యాఖ్యల గురించి పెద్ద చర్చే నడిచింది. ఆయనపై పవన్ ఫ్యాన్స్, జనసేన మద్దతుదారులు విరుచుకుపడ్డారు. కాగా ప్రకాష్ రాజ్ తాజాగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు తన మద్దతు ప్రకటించారు. రైతుల బాధల గురించి మాట్లాడారు.
దీనిపై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక నటుడు, రాజకీయ నాయకుడు అయిన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే పెద్ద చర్చనీయాంశం అయ్యాయని, అవి పతాక శీర్షికలకు ఎక్కాయని కానీ ఏ పక్షపాతం లేకుండా, రాజకీయ అజెండా లేకుండా రైతుల గురించి మాట్లాడితే ఎవరూ పట్టించుకోవట్లేదని.. ఇది హిపోక్రసీ కాదా అని ప్రశ్నించింది పూనమ్. దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. వాళ్లు తమ అజెండా ప్రకారం అంతా చేస్తున్నారు అని ట్వీట్ చేశాడు. తర్వాత పూనమ్ స్పందిస్తూ.. రాజకీయ అజెండాకు తాను కూడా బాధితురాలినే అని వ్యాఖ్యానించింది. పవన్ పేరెత్తకుండా ఆయనకు సంబంధించిన విషయంలో పూనమ్ వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…