పూనమ్ కౌర్.. ఈ పేరు టాలీవుడ్ వర్గాల్లో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఐతే ఆమె వార్తల్లో నిలిచేది సినిమాకు సంబంధించిన అంశాలతో కాకపోవడమే ట్విస్టు. పంజాబీ అమ్మాయి అయిన పూనమ్ దశాబ్దం కిందట్నుంచి హైదరాబాద్లోనే ఉంటోంది. ఆమె చేసిన సినిమాలన్నీ చిన్నా చితకవే. వాటిలో కూడా కాస్తో కూస్తో ఆడినవి తక్కువే. కొన్నేళ్ల నుంచి పూనమ్ సినిమాల్లో కనిపించడం కూడా తగ్గిపోయింది. అయినా సరే.. సినిమాయేతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
పవన్ కళ్యాణ్తో ముడిపెట్టి ఆమె గురించి చర్చ పెడుతుంటారు జనాలు. ఆమె కూడా ఈ విషయంలో జనాలకున్న సందేహాలను మరింత పెంచేలా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటుంది. కొన్నిసార్లు ఆమె పవన్ కళ్యాణ్కు అనుకూలంగా కామెంట్లు చేస్తుంటుంది. కొన్నిసార్లేమో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటుంది. కౌంటర్లు వేస్తుంటుంది.
తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్తో ముడిపడ్డ ఓ అంశంపై ఆమె మాట్లాడింది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల గురించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆ వ్యాఖ్యల గురించి పెద్ద చర్చే నడిచింది. ఆయనపై పవన్ ఫ్యాన్స్, జనసేన మద్దతుదారులు విరుచుకుపడ్డారు. కాగా ప్రకాష్ రాజ్ తాజాగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు తన మద్దతు ప్రకటించారు. రైతుల బాధల గురించి మాట్లాడారు.
దీనిపై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక నటుడు, రాజకీయ నాయకుడు అయిన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే పెద్ద చర్చనీయాంశం అయ్యాయని, అవి పతాక శీర్షికలకు ఎక్కాయని కానీ ఏ పక్షపాతం లేకుండా, రాజకీయ అజెండా లేకుండా రైతుల గురించి మాట్లాడితే ఎవరూ పట్టించుకోవట్లేదని.. ఇది హిపోక్రసీ కాదా అని ప్రశ్నించింది పూనమ్. దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. వాళ్లు తమ అజెండా ప్రకారం అంతా చేస్తున్నారు అని ట్వీట్ చేశాడు. తర్వాత పూనమ్ స్పందిస్తూ.. రాజకీయ అజెండాకు తాను కూడా బాధితురాలినే అని వ్యాఖ్యానించింది. పవన్ పేరెత్తకుండా ఆయనకు సంబంధించిన విషయంలో పూనమ్ వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
This post was last modified on December 6, 2020 3:25 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…