Movie News

ఇండియన్ థియేటర్లను బతికిస్తున్న ఆ సినిమా


టెనెట్.. టెనెట్.. టెనెట్.. ఇప్పుడు భారతీయ సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న సినిమా ఇది. కరోనా కారణంగా ఏడెనిమిది నెలల పాటు మూత పడి ఈ మధ్యే తెరుచుకున్న ఇండియన్ థియేటర్లను బతికిస్తున్నది ఈ సినిమానే. అక్టోబరు మధ్య నుంచే థియేటర్లు పున:ప్రారంభించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ అప్పుడు కొద్ది సంఖ్యలోనే థియేటర్లను తెరిచారు. గత నెల రోజుల వ్యవధిలో పలు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులు పున:ప్రారంభం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యే థియేటర్లు తెరిచారు.

ఐతే ముందు తెరుచుకున్న థియేటర్లలో ఏవోవో సినిమాలు వేసి ఆడించారు కానీ.. వాటికి కనీస స్పందన లేకపోయింది. దీంతో థియేటర్లు తెరుచుకున్నాయంటే తెరుచుకున్నాయి అన్నట్లయింది పరిస్థితి. కొత్త సినిమా, అందులోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా లేకపోవడమే ఇందుక్కారణం.

ఐతే ‘టెనెట్’ లాంటి భారీ హాలీవుడ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసరికి ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ చిత్రం ఈ నెల 4న ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లిష్, హిందీ, తెలుగు వెర్షన్లు నడుస్తున్నాయి. అన్ని వెర్షన్లకూ స్పందన బాగానే ఉంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడిపిస్తుండగా.. హైదరాబాద్‌లో మెజారిటీ మల్టీప్లెక్సుల్లో వీకెండ్ షోలు ఫుల్ అయ్యాయి. వీక్ డేస్‌లో కూడా బుకింగ్స్ బాగుంటాయనే అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరవడమైతే తెరిచారు కూడా అంతకుముందు నుంచి థియేటర్లు నడుస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితులు చూసి జనాల నుంచి ఏమాత్రం స్పందన ఉంటుందో అని సందేహించారు. కానీ ‘టెనెట్’ ఆడుతున్న థియేటర్లలో అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ‘టెనెట్’ను కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే ధైర్యం చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. సినిమాకు మంచి రివ్యూలొచ్చినా.. కరోనా ప్రభావం వల్ల వసూళ్లు ఆశాజనకంగా లేవు. ఐతే ఎట్టకేలకు ఇండియాలో రిలీజైన ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అందరికీ సంతోషం కలిగిస్తోంది.

This post was last modified on December 6, 2020 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

15 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

16 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

3 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

8 hours ago