డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు కుటుంబంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఇవి ఇంకా కొనసాగుతున్నాయని కొందరు చెబుతారు. అయితే.. ప్రస్తుతానికి ఈ కుటుంబంలో మౌనం రాజ్యమేలుతోంది. చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్, పెద్ద కుమారుడు మంచు విష్ణుల మధ్య వివాదాలు చినుకు చినుకు గాలివానగా మారాయి. ఇవి కేసులు, కోర్టుల వరకు కూడా వెళ్లాయి. గత మూడు మాసాల కిందటి వరకు మీడియాలోనూ హైలెట్గా నిలిచాయి.
అయితే.. ఈ ఫ్యామిలీకే చెందిన మరో నటి, మోహన్బాబుకుమార్తె మంచు లక్ష్మి ఈ వివాదాలపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ, తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. కుటుం బాల్లో ఘర్షణలు కామనేని చెప్పారు. అయితే.. అవి తెగేదాకా లాగడం సరికాదని, బంధాలను తెంచుకునేం దుకు ప్రయత్నించడం కూడా సరికాదని అన్నారు. తన కుటుంబంలో తలెత్తిన వివాదాలు తనను ఎంత గానో కలచి వేశాయని చెప్పారు. వాస్తవానికి తమ కుటుంబం ఇంత పెద్ద గొడవలు వస్తాయని తాను ఊహించలేదన్నారు.
మా కుటుంబం మళ్లీ కలిసిమెలిసి ఉండాలనే తాను కోరుకుంటున్నట్టు మంచు లక్ష్మి చెప్పారు. వాస్తవానికి అన్ని కుటుంబాల్లోనూ ఏవో ఒక గొడవలు ఉంటూనే ఉంటాయన్నారు. కానీ, ఎన్ని వివాదాలు వచ్చినా.. తర్వాత కలుసుకునే ప్రయత్నం చేయాలని.. చివరి వరకు ఉండేది కుటుంబ సంబంధాలేనని చెప్పారు. కానీ, దేశంలో రానురాను కుటుంబ బంధాలు.. తుదిదాకా చేరి తెగే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఇలా అయితే.. కుటుంబ వ్యవస్థకే ప్రమాదమని తన అభిప్రాయంగా చెప్పారు.
ఇక, తనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. “మా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల సమయం లో నేను స్పందించలేదని చాలా మంది విమర్శించారు. కానీ, ఆ సమయంలో నేను చాలా బాధలో ఉన్నా ను. ఏం స్పందించాలి? అయినా.. బయటివారికి ఎందుకు చెప్పాలి?. ఇది మా కుటుంబ వ్యవహారం.“ అని లక్ష్మి చెప్పుకొచ్చారు. ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలన్న ఆమె.. విడిపోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 27, 2025 4:12 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…