డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు కుటుంబంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఇవి ఇంకా కొనసాగుతున్నాయని కొందరు చెబుతారు. అయితే.. ప్రస్తుతానికి ఈ కుటుంబంలో మౌనం రాజ్యమేలుతోంది. చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్, పెద్ద కుమారుడు మంచు విష్ణుల మధ్య వివాదాలు చినుకు చినుకు గాలివానగా మారాయి. ఇవి కేసులు, కోర్టుల వరకు కూడా వెళ్లాయి. గత మూడు మాసాల కిందటి వరకు మీడియాలోనూ హైలెట్గా నిలిచాయి.
అయితే.. ఈ ఫ్యామిలీకే చెందిన మరో నటి, మోహన్బాబుకుమార్తె మంచు లక్ష్మి ఈ వివాదాలపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ, తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. కుటుం బాల్లో ఘర్షణలు కామనేని చెప్పారు. అయితే.. అవి తెగేదాకా లాగడం సరికాదని, బంధాలను తెంచుకునేం దుకు ప్రయత్నించడం కూడా సరికాదని అన్నారు. తన కుటుంబంలో తలెత్తిన వివాదాలు తనను ఎంత గానో కలచి వేశాయని చెప్పారు. వాస్తవానికి తమ కుటుంబం ఇంత పెద్ద గొడవలు వస్తాయని తాను ఊహించలేదన్నారు.
మా కుటుంబం మళ్లీ కలిసిమెలిసి ఉండాలనే తాను కోరుకుంటున్నట్టు మంచు లక్ష్మి చెప్పారు. వాస్తవానికి అన్ని కుటుంబాల్లోనూ ఏవో ఒక గొడవలు ఉంటూనే ఉంటాయన్నారు. కానీ, ఎన్ని వివాదాలు వచ్చినా.. తర్వాత కలుసుకునే ప్రయత్నం చేయాలని.. చివరి వరకు ఉండేది కుటుంబ సంబంధాలేనని చెప్పారు. కానీ, దేశంలో రానురాను కుటుంబ బంధాలు.. తుదిదాకా చేరి తెగే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఇలా అయితే.. కుటుంబ వ్యవస్థకే ప్రమాదమని తన అభిప్రాయంగా చెప్పారు.
ఇక, తనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. “మా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల సమయం లో నేను స్పందించలేదని చాలా మంది విమర్శించారు. కానీ, ఆ సమయంలో నేను చాలా బాధలో ఉన్నా ను. ఏం స్పందించాలి? అయినా.. బయటివారికి ఎందుకు చెప్పాలి?. ఇది మా కుటుంబ వ్యవహారం.“ అని లక్ష్మి చెప్పుకొచ్చారు. ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలన్న ఆమె.. విడిపోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 27, 2025 4:12 pm
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…