డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు కుటుంబంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఇవి ఇంకా కొనసాగుతున్నాయని కొందరు చెబుతారు. అయితే.. ప్రస్తుతానికి ఈ కుటుంబంలో మౌనం రాజ్యమేలుతోంది. చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్, పెద్ద కుమారుడు మంచు విష్ణుల మధ్య వివాదాలు చినుకు చినుకు గాలివానగా మారాయి. ఇవి కేసులు, కోర్టుల వరకు కూడా వెళ్లాయి. గత మూడు మాసాల కిందటి వరకు మీడియాలోనూ హైలెట్గా నిలిచాయి.
అయితే.. ఈ ఫ్యామిలీకే చెందిన మరో నటి, మోహన్బాబుకుమార్తె మంచు లక్ష్మి ఈ వివాదాలపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ, తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. కుటుం బాల్లో ఘర్షణలు కామనేని చెప్పారు. అయితే.. అవి తెగేదాకా లాగడం సరికాదని, బంధాలను తెంచుకునేం దుకు ప్రయత్నించడం కూడా సరికాదని అన్నారు. తన కుటుంబంలో తలెత్తిన వివాదాలు తనను ఎంత గానో కలచి వేశాయని చెప్పారు. వాస్తవానికి తమ కుటుంబం ఇంత పెద్ద గొడవలు వస్తాయని తాను ఊహించలేదన్నారు.
మా కుటుంబం మళ్లీ కలిసిమెలిసి ఉండాలనే తాను కోరుకుంటున్నట్టు మంచు లక్ష్మి చెప్పారు. వాస్తవానికి అన్ని కుటుంబాల్లోనూ ఏవో ఒక గొడవలు ఉంటూనే ఉంటాయన్నారు. కానీ, ఎన్ని వివాదాలు వచ్చినా.. తర్వాత కలుసుకునే ప్రయత్నం చేయాలని.. చివరి వరకు ఉండేది కుటుంబ సంబంధాలేనని చెప్పారు. కానీ, దేశంలో రానురాను కుటుంబ బంధాలు.. తుదిదాకా చేరి తెగే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఇలా అయితే.. కుటుంబ వ్యవస్థకే ప్రమాదమని తన అభిప్రాయంగా చెప్పారు.
ఇక, తనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. “మా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల సమయం లో నేను స్పందించలేదని చాలా మంది విమర్శించారు. కానీ, ఆ సమయంలో నేను చాలా బాధలో ఉన్నా ను. ఏం స్పందించాలి? అయినా.. బయటివారికి ఎందుకు చెప్పాలి?. ఇది మా కుటుంబ వ్యవహారం.“ అని లక్ష్మి చెప్పుకొచ్చారు. ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలన్న ఆమె.. విడిపోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 27, 2025 4:12 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…