థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు కదిలి వస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇంకా కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ టైమ్లోనే థియేటర్లు తెరవగానే జనం బారులు తీరారు. సగం టికెట్లే అమ్మాలనే రూల్ని కచ్చితంగా పాటిస్తోన్న థియేటర్లకు మొదటి వారాంతంలో వచ్చిన స్పందనతో ఊరట లభించింది. ఈ ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగుతాయి కనుక ఈలోగా తక్కువ సినిమాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
అందరు నిర్మాతలకు, అన్ని సినిమాలకు సమ అవకాశాలు లభించేలా గిల్డ్ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ నాటికి థియేటర్లు పూర్తి స్థాయిలో ఆపరేట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పటికి కరోనా తాకిడి ఎలా వున్నా కానీ జనం పెద్దగా పట్టించుకోరనేది స్పష్టమయింది. అయితే ఓవర్సీస్ మార్కెట్తోనే తంటా వచ్చి పడుతోంది. అక్కడ పరిస్థితులు మళ్లీ ఎప్పటికి మామూలు అవుతాయనేది అర్థం కావడం లేదు.
ఓవర్సీస్ మార్కెట్ సంగతెలా వున్నా పెద్ద సినిమాల విడుదల అయితే ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ బిగ్ రిలీజ్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ అవుతుంది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. పవన్ని వెండితెరపై చూడాలని ఎదురు చూస్తోన్న అభిమానులు తొలి వారంలో సినిమా టాక్తో సంబంధం లేకుండా థియేటర్లపై ఎగబడడం ఖాయమనిపిస్తోంది.
This post was last modified on December 6, 2020 1:58 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…