థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు కదిలి వస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇంకా కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ టైమ్లోనే థియేటర్లు తెరవగానే జనం బారులు తీరారు. సగం టికెట్లే అమ్మాలనే రూల్ని కచ్చితంగా పాటిస్తోన్న థియేటర్లకు మొదటి వారాంతంలో వచ్చిన స్పందనతో ఊరట లభించింది. ఈ ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగుతాయి కనుక ఈలోగా తక్కువ సినిమాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
అందరు నిర్మాతలకు, అన్ని సినిమాలకు సమ అవకాశాలు లభించేలా గిల్డ్ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ నాటికి థియేటర్లు పూర్తి స్థాయిలో ఆపరేట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పటికి కరోనా తాకిడి ఎలా వున్నా కానీ జనం పెద్దగా పట్టించుకోరనేది స్పష్టమయింది. అయితే ఓవర్సీస్ మార్కెట్తోనే తంటా వచ్చి పడుతోంది. అక్కడ పరిస్థితులు మళ్లీ ఎప్పటికి మామూలు అవుతాయనేది అర్థం కావడం లేదు.
ఓవర్సీస్ మార్కెట్ సంగతెలా వున్నా పెద్ద సినిమాల విడుదల అయితే ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ బిగ్ రిలీజ్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ అవుతుంది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. పవన్ని వెండితెరపై చూడాలని ఎదురు చూస్తోన్న అభిమానులు తొలి వారంలో సినిమా టాక్తో సంబంధం లేకుండా థియేటర్లపై ఎగబడడం ఖాయమనిపిస్తోంది.
This post was last modified on December 6, 2020 1:58 am
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…