తెలుగు వాడైన తమిళ హీరో విశాల్ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుంటాడు. తన నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్లతో అతడికి చాలా గొడవలే ఉన్నాయి. ఐతే వాటిలో ఒక వివాదం చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. ఆ వ్యవహారం కోర్టుకు కూడాా వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మద్రాస్ హైకోర్టు.. విశాల్పై సీరియస్ అయింది. వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ను ఆదేశించింది. లేదంటే దివాళా తీసినట్లు ప్రకటిస్తారా అని కూడా కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి వివరాలేంటో చూద్దాం.
కోలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బు చెళియన్ గతంలో ఒక సినిమా కోసమని విశాల్కు రూ.21 కోట్ల రుణం ఇచ్చాడు. ఆ తర్వాత వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఐతే ఇందుకు గాను విశాల్ నటించే సినిమాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇవ్వాలని లైకా షరతు విధించింది. కానీ విశాల్ అలా చేయలేదు. పైగా రుణాన్ని లైకాకు తిరిగి ఇవ్వలేదు. దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కొన్నేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఇటీవల మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ ఈ కేసు విషయంలో లైకా సంస్థకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. రూ.21 కోట్ల రుణానికి 30 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై విశాల్ అప్పీల్కు వెళ్లాడు. దీనిపై విచారణ సందర్భంగా.. తమ క్లైంట్ అంత డబ్బు కట్టేంత ధనవంతుడు కాదని విశాల్ లాయర్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. విశాల్ ధనవంతుడు కాకపోతే దివాళా తీసినట్లు ప్రకటిస్తారా అని పేర్కొంది. వెంటనే ఈ కేసుకు సంబంధించి రూ.10 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు విశాల్ను ఆదేశించింది.
This post was last modified on November 25, 2025 6:22 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…