తెలుగు వాడైన తమిళ హీరో విశాల్ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుంటాడు. తన నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్లతో అతడికి చాలా గొడవలే ఉన్నాయి. ఐతే వాటిలో ఒక వివాదం చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. ఆ వ్యవహారం కోర్టుకు కూడాా వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మద్రాస్ హైకోర్టు.. విశాల్పై సీరియస్ అయింది. వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ను ఆదేశించింది. లేదంటే దివాళా తీసినట్లు ప్రకటిస్తారా అని కూడా కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి వివరాలేంటో చూద్దాం.
కోలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బు చెళియన్ గతంలో ఒక సినిమా కోసమని విశాల్కు రూ.21 కోట్ల రుణం ఇచ్చాడు. ఆ తర్వాత వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఐతే ఇందుకు గాను విశాల్ నటించే సినిమాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇవ్వాలని లైకా షరతు విధించింది. కానీ విశాల్ అలా చేయలేదు. పైగా రుణాన్ని లైకాకు తిరిగి ఇవ్వలేదు. దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కొన్నేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఇటీవల మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ ఈ కేసు విషయంలో లైకా సంస్థకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. రూ.21 కోట్ల రుణానికి 30 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై విశాల్ అప్పీల్కు వెళ్లాడు. దీనిపై విచారణ సందర్భంగా.. తమ క్లైంట్ అంత డబ్బు కట్టేంత ధనవంతుడు కాదని విశాల్ లాయర్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. విశాల్ ధనవంతుడు కాకపోతే దివాళా తీసినట్లు ప్రకటిస్తారా అని పేర్కొంది. వెంటనే ఈ కేసుకు సంబంధించి రూ.10 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు విశాల్ను ఆదేశించింది.
This post was last modified on November 25, 2025 6:22 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…