న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ ఏ దశలో ఉందనేది స్పష్టమైన సమాచారం అందటం లేదు. మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చాక తిరిగి వేగవంతం చేశారు కానీ ఆగడం సాగడం జరుగుతోందనే రీతిలో పలు ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ముందు నుంచి ప్యారడైజ్ టీమ్ విడుదల తేదీ విషయంలో పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 26 రిలీజ్ చేసే తీరతామని పలు సందర్భాల్లో ప్రమోషన్ల రూపంలో చెబుతూ వచ్చింది. కానీ ఇప్పటిదాకా ఒక పాట కానీ, విజువల్ కంటెంట్ కానీ టీమ్ వదల్లేదు. జైల్లో తీసిన చిన్న గ్లిమ్ప్స్ తప్ప ఇంకేదీ చూపించలేదు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం ప్యారడైజ్ కోసం ఒక భారీ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు సమాచారం. టైటిల్ ఎలాగూ రివీల్ చేశారు కాబట్టి మొదటి పాట లేదా టీజర్ ని దేశ విదేశాల మీడియా ప్రతినిధులను పిలిచి వాళ్ళ మధ్యలో లాంచ్ చేయాలనే ప్రతిపాదన సీరియస్ గా పరిశీలిస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమో తేలాలంటే టైం పట్టేలా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ మధ్య షూట్ కి బ్రేక్ ఇచ్చారని, నిర్మాతతో ఏవో కాస్త విభేదాలు వచ్చాయనే గాసిప్స్ కూడా బయట తిరిగాయి. ఇప్పుడు పేర్లు లేకుండా సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్ రకరకాల పుకార్లను తెరమీదకు తెస్తున్నాయి.
వీటికి చెక్ పడాలంటే ప్యారడైజ్ నుంచి సాలిడ్ గా ఏదైనా అప్డేట్ రావాలి. పోటీలో ఉన్న పెద్ది నుంచి ఆల్రెడీ చికిరి చికిరి వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయ్యింది. నాని మూవీకి అనిరుద్ రవిచందర్ అంతకు మించిన పాటలు ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల అదే పని మీద ఇటీవలే చెన్నై వెళ్లాడని టాక్. వచ్చే నెల అనిరుధ్ చాలా అంటే చాలా బిజీగా మారబోతున్నాడు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పనులు, జన నాయకుడు రీ రికార్డింగ్ తో పాటు మలేషియాలో జరిగే ఈవెంట్ తాలూకు ప్రిపరేషన్ ఇలా టైట్ షెడ్యూల్ ఉంది. మరి ప్యారడైజ్ కోసం తగినంత క్వాలిటీ సమయం కేటాయిస్తాడా అనేది వేచి చూడాలి.
This post was last modified on November 25, 2025 5:47 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…