సినీ రంగంలో హీరోయిన్లతో పోలిస్తే హీరోలకు పారితోషకాలు ఎక్కువ ఉంటుందన్నది కొత్త విషయం కాదు. ఓవైపు ఒక స్టార్ హీరో రూ.50 కోట్లు పుచ్చుకుంటుంటే.. అదే సినిమాలో నటించే స్టార్ హీరోయిన్కు అందులో నాలుగో వంతు కూడా ఇవ్వరన్న విషయం తెలిసిందే. ఈ అంతరం గురించి కొందరు హీరోయిన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ఇదేం వివక్ష అని అడుగుతుంటారు. ఐతే ఒక ఇంటర్వ్యూలో ఇదే టాపిక్ చర్చకు వస్తే.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ భలే సమాధానం ఇచ్చాడు.
తన పక్కన ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను పెట్టుకుని.. వాళ్లు ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయన ఆసక్తికర జవాబు ఇచ్చాడు. ఇక్కడ ఆర్టిస్టు పురుషుడా, మహిళా అనేది సంబంధం లేదని.. ఎవరి డిమాండును బట్టి, మార్కెట్ను బట్టి వారికి పారితోషకం ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఒకవేళ హీరోయిన్కు మార్కెట్, డిమాండ్ ఎక్కువ ఉంటే.. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్ ఇస్తారని.. హీరోకు అంత లేకుంటే పారితోషకం తగ్గుతుందని ఆమిర్ స్పష్టం చేశాడు.
ఇప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ కూడా అచ్చంగా ఇదే రకంగా మాట్లాడింది. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువ పారితోషకం ఇవ్వడంపై ఆమె నెగెటివ్ కామెంట్లేమీ చేయలేదు. ఇందులో వివక్ష అంటూ ఏమీ లేదని ఆమె అభిప్రాయపడింది. ఏదైనా మార్కెట్ను అనుసరించే ఉంటుందని కీర్తి చెప్పింది. ఒక ఆర్టిస్టుకు ఉన్న డిమాండ్, మార్కెట్ను బట్టే పారితోషకం ఇస్తారని.. హీరోలతో పోలిస్తే తనకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనే బాధ తనకు ఎప్పుడూ లేదని ఆమె అభిప్రాయపడింది. డిమాండ్ను బట్టే ఏదైనా ఉంటుందని ఆమె స్పష్టం చేసింది.
ఇక తాను లీడ్ రోల్ చేసిన ‘రివాల్వర్ రీటా’ గురించి మాట్లాడుతూ.. ఇది 24 గంటల వ్యవధిలో జరిగే కథతో తెరకెక్కిందని ఆమె చెప్పింది. సినిమాలో బోలెడన్ని ట్విస్టులుంటాయని.. థ్రిల్ చేస్తూనే వినోదాన్ని పంచుతూ సినిమా సాగుతుందని ఆమె పేర్కొంది. ‘రివాల్వర్ రీటా’ తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 25, 2025 11:41 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…