సినీ రంగంలో హీరోయిన్లతో పోలిస్తే హీరోలకు పారితోషకాలు ఎక్కువ ఉంటుందన్నది కొత్త విషయం కాదు. ఓవైపు ఒక స్టార్ హీరో రూ.50 కోట్లు పుచ్చుకుంటుంటే.. అదే సినిమాలో నటించే స్టార్ హీరోయిన్కు అందులో నాలుగో వంతు కూడా ఇవ్వరన్న విషయం తెలిసిందే. ఈ అంతరం గురించి కొందరు హీరోయిన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ఇదేం వివక్ష అని అడుగుతుంటారు. ఐతే ఒక ఇంటర్వ్యూలో ఇదే టాపిక్ చర్చకు వస్తే.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ భలే సమాధానం ఇచ్చాడు.
తన పక్కన ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను పెట్టుకుని.. వాళ్లు ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయన ఆసక్తికర జవాబు ఇచ్చాడు. ఇక్కడ ఆర్టిస్టు పురుషుడా, మహిళా అనేది సంబంధం లేదని.. ఎవరి డిమాండును బట్టి, మార్కెట్ను బట్టి వారికి పారితోషకం ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఒకవేళ హీరోయిన్కు మార్కెట్, డిమాండ్ ఎక్కువ ఉంటే.. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్ ఇస్తారని.. హీరోకు అంత లేకుంటే పారితోషకం తగ్గుతుందని ఆమిర్ స్పష్టం చేశాడు.
ఇప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ కూడా అచ్చంగా ఇదే రకంగా మాట్లాడింది. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువ పారితోషకం ఇవ్వడంపై ఆమె నెగెటివ్ కామెంట్లేమీ చేయలేదు. ఇందులో వివక్ష అంటూ ఏమీ లేదని ఆమె అభిప్రాయపడింది. ఏదైనా మార్కెట్ను అనుసరించే ఉంటుందని కీర్తి చెప్పింది. ఒక ఆర్టిస్టుకు ఉన్న డిమాండ్, మార్కెట్ను బట్టే పారితోషకం ఇస్తారని.. హీరోలతో పోలిస్తే తనకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనే బాధ తనకు ఎప్పుడూ లేదని ఆమె అభిప్రాయపడింది. డిమాండ్ను బట్టే ఏదైనా ఉంటుందని ఆమె స్పష్టం చేసింది.
ఇక తాను లీడ్ రోల్ చేసిన ‘రివాల్వర్ రీటా’ గురించి మాట్లాడుతూ.. ఇది 24 గంటల వ్యవధిలో జరిగే కథతో తెరకెక్కిందని ఆమె చెప్పింది. సినిమాలో బోలెడన్ని ట్విస్టులుంటాయని.. థ్రిల్ చేస్తూనే వినోదాన్ని పంచుతూ సినిమా సాగుతుందని ఆమె పేర్కొంది. ‘రివాల్వర్ రీటా’ తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 25, 2025 11:41 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…