డిసెంబర్ 5 విడుదల కాబోతున్న అఖండ తాండవం 2 కు ముందు రోజే ప్రీమియర్లు వేయడం దాదాపు ఖాయమైనట్టే. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఓజి తరహాలో టికెట్ రేట్ వెయ్యి రూపాయలు పెట్టాలా లేక ఆరేడు వందల మధ్యలో నిర్ణయించాలానే దాని మీద డిస్ట్రిబ్యూటర్లు తర్జన భర్జన పడుతున్నారట. ఎందుకంటే అఖండ 2 మీద అంచనాలు ఉన్న మాట వాస్తవమే కానీ మరీ ఓజి స్థాయిలో కాదు. పైగా ఇప్పటిదాకా వదిలిన రెండు పాటలు హిట్టయినా చెప్పుకునే రేంజ్ లో వైరల్ కాలేదు. నిన్న వదిలిన ట్రైలర్ లో మాస్ స్టఫ్ ఫుల్లుగా ఉంది కానీ హడావిడి ఎక్కువైపోవడంతో కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది.
అయితే బోయపాటి శీనుని తక్కువంచనా వేయడానికి లేదు. థియేట్రికల్ గా తనిచ్చే హై మాములుగా లేదు. స్కంద ఫ్లాప్ అయినా సరే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికీ చెప్పుకుంటారు. వినయ విధేయ రామకు సంవత్సరాల తరబడి భారీ టిఆర్పి వచ్చింది. డిజాస్టర్లకే అంత రెస్పాన్స్ తెచ్చుకున్న బోయపాటి తనకు మూడు ఇండస్ట్రీ హిట్ అవకాశాలు ఇచ్చిన బాలయ్యని ఆషామాషీగా చూపించడుగా. ఈ విషయాన్ని సింహా. లెజెండ్, అఖండ ఆల్రెడీ ఋజువు చేశాయి. ఇక అఖండ 2 ఏ రేంజులో ఉంటుందో వేరే చెప్పాలా. నందమూరి ఫ్యాన్స్ నమ్మకం అదే.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇకపై టికెట్ హైక్స్ కావాలంటే సినీ కార్మికులకు పాతిక శాతం ఫండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్మాన సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి అఖండ 2 నైజాం హక్కులు కొన్న దిల్ రాజు ఫిలిం ఫెడరేషన్ చైర్ మెన్ గా ఎలాంటి ప్రతిపాదన ఇస్తారో వేచి చూడాలి. మొత్తానికి ముందే రోజే బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం రాబోతోంది. అధికారికంగా ప్రీమియర్లకు సంబందించిన ప్రకటన రావడానికి ఇంకా టైం పట్టొచ్చు. బోయపాటి శీను టీమ్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కి అఖండ 2 శ్రీకారం చుడుతుందనే ధీమాలో ఉన్నారు.
This post was last modified on November 22, 2025 12:06 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…