బాలీవుడ్ స్టార్ కిడ్స్తో పార్టీలు, వింత వింత ఫోజ్ ఆకారాలు, అసలు ఏం చేస్తాడో ఎవరికీ తెలియని ఒక మిస్టరీ ప్రొఫెషన్.. ఇదీ సోషల్ మీడియా సెన్సేషన్ ఓర్రీ గురించి అందరికీ తెలిసింది. నిత్యం సెలబ్రిటీలతో చిల్ అవుతూ కనిపించే ఓర్రీ, ఇప్పుడు అనూహ్యంగా ఓ భారీ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. ఏకంగా రూ. 252 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసులో విచారణకు రావాలంటూ ముంబై పోలీసులు అతనికి సమన్లు జారీ చేయడం ఇప్పుడు బీ-టౌన్లో హాట్ టాపిక్గా మారింది.
అసలు ఈ కేసు కథేంటంటే.. మార్చి 2024లో ముంబై పోలీసులు మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉన్న ఓ డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అక్కడ ఏకంగా 126 కిలోల మెఫెడ్రోన్ దొరికింది. దీని విలువ మార్కెట్లో రూ. 252 కోట్లు ఉంటుంది. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న కీలక సూత్రధారి సలీం షేక్ అలియాస్ ‘లావిష్’. ఇతన్ని దుబాయ్ నుంచి అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చారు. ఇతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు చెందిన సలీం డోలాకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.
పోలీసుల విచారణలో ఈ సలీం షేక్ సంచలనం రేపే విషయాలు బయటపెట్టాడు. తాను ఇండియాలోనూ, విదేశాల్లోనూ సెలబ్రిటీల కోసం హై ప్రొఫైల్ ‘రేవ్ పార్టీలు’ అరేంజ్ చేసేవాడినని ఒప్పుకున్నాడు. ఆ పార్టీలకు ఎవరెవరు వచ్చేవారో చెబుతూ.. ఓర్రీ పేరును కూడా ప్రస్తావించాడు. కేవలం ఓర్రీ మాత్రమే కాదు, శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి వంటి మరికొందరు స్టార్ల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ డ్రగ్స్ రాకెట్ మూలాలు బాలీవుడ్లో ఎంత లోతుగా ఉన్నాయోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, ఓర్రీని పోలీసులు ఇంకా నిందితుడిగా చేర్చలేదు. సలీం షేక్ చెప్పిన మాటల్లో నిజమెంతో తేల్చడానికి, కేవలం విచారణ కోసమే పిలిచారు. గురువారం హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా, తాను ప్రస్తుతం ఊర్లో లేనని, నవంబర్ 25 తర్వాత వస్తానని ఓర్రీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమన్లు వచ్చిన సమయంలోనే ఓర్రీ ముంబైలో ఓ మ్యూజిక్ కాన్సర్ట్లో ఎంజాయ్ చేస్తూ కనిపించడం గమనార్హం.
ఓర్రీ ఇలా చట్టపరమైన ఇబ్బందుల్లో పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో, నిషేధిత ప్రాంతంలో మద్యం సేవించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులో పేరు వినిపించడం అతని ఇమేజ్కి పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇది కేవలం విచారణే అయినా, తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఓర్రీ నుంచి ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి.
This post was last modified on November 21, 2025 11:26 am
గుంటూరులోని తూర్పు, పడమర నియోజకవర్గాల్లో వైసీపీ తన ప్రభావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్నరేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బతిందన్న…
ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…
'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…
కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా…
కోలీవుడ్ స్టార్ సూర్య సుడి బాగుంది. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ గజిని హీరోకి…
ఆగస్ట్ 21 ఇరుముడి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ…