హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి 22 సంవత్సరాల తర్వాత కూడా చేతి నిండా సినిమాలు అది కూడా కథానాయికగానే అంటే ఆశ్చర్యం కాదు షాక్ కలిగించే విషయం. నయనతార ఎందుకు లేడీ సూపర్ స్టార్ అయ్యిందో అర్థం చేసుకోవాలంటే తన డిమాండ్ చూస్తే సరి. ప్రస్తుతం తన నుంచి రాబోతున్నవి ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది చిత్రాలున్నాయి. ఇంకా కొత్తవి సైన్ చేయడానికి కాల్ షీట్లు లేక వెయిటింగ్ లో పెట్టింది. ఇటీవలే బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే పీరియాడిక్ యాక్షన్ గ్రాండియర్ లో తననే తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగోసారి బాలయ్యతో జట్టు కట్టడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
చిరంజీవితో చేసిన మన శంకరవరప్రసాద్ గారు జనవరి సంక్రాంతికి విడుదల కానుంది. యష్ టాక్సిక్ ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తి చేసుకుని మార్చి రిలీజ్ కు సిద్ధమవుతోంది. వంద కోట్ల బడ్జెట్ తో సుందర్ సి తీస్తున్న మూకుతి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి సీక్వెల్) ని కేవలం తన పేరు మీదే బిజినెస్ చేస్తున్నారు. సగం ఓటిటి హక్కుల ద్వారానే రికవర్ అయిపోతుందట. ఇవి కాకుండా డియర్ స్టూడెంట్స్ – పాట్రియాట్ అనే మలయాళం మూవీస్ తో పాటు మన్నన్ గట్టి సిన్స్ 1960, హాయ్, రక్కయి అనే తమిళ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయ్. ఇవన్నీ 2026లోనే థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తాయి.
ఒకపక్క శ్రీలీల, రష్మిక మందన్న లాంటి యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్న టైంలోనూ నయనతార ఇంత డిమాండ్ లో ఉండటం విశేషం. ఇద్దరు బిడ్డల తల్లిగా ఉంటూ కూడా షెడ్యూల్స్ మానేజ్ చేసుకోవడం చిన్న విషయం కాదు. భర్త విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ మూడో వారం విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో నయన్ నటించలేదు కానీ చాలా గ్యాప్ తర్వాత శ్రీవారు హిట్టు కొడతాడనే నమ్మకంతో ఎదురు చూస్తోంది. త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు కూడా అడిగారట కానీ ఎందుకో మరి లక్ష్మి కాంబో కార్యరూపం దాల్చలేదు. నయన్ డైరీ చూస్తే సీనియర్లకు ఈర్ష్య కలగడంలో ఆశ్చర్యం ఏముంది.
This post was last modified on November 20, 2025 10:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…