హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు అవకాశాలకు లోటు లేదు. ఆఫర్లు వస్తున్నాయి. ఏ ముహూర్తంలో దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఛాన్స్ ఇచ్చాడో కానీ అది డిజాస్టర్ అయినా సరే అమ్మడికి మాత్రం దశ తిరిగింది. పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు తనవైపు చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ కింగ్డమ్ దొరికింది. భారీ బడ్జెట్ తో సితార సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఫ్లాప్ ముద్ర పడింది. తాజాగా విడుదలైన దుల్కర్ సల్మాన్ కాంత సైతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. తమిళంలో ఓకే అనిపించుకున్నా తెలుగులో మాత్రం నిరాశపరిచింది.
ఇప్పుడు ఇదే నెలలో రామ్ తో కలిసి ఆంధ్రకింగ్ తాలూకాలో భాగ్యశ్రీ బోర్సే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్రైలర్ చూస్తే నమ్మకం పెట్టుకోవచ్చు అనేలాగే ఉంది. రామ్, ఉపేంద్రల మధ్య ఫ్యాన్ హీరో ఎమోషన్ తీసుకున్న దర్శకుడు మహేష్ బాబు ఏదో కొత్త ప్రయత్నమైతే చేశాడు. సంగీత దర్శకులు వివేక్ మెర్విన్ పాటలు మెల్లగా చొచ్చుకుపోతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత రామ్ ఎనర్జీ పూర్తి స్థాయిలో తెరమీద కనిపిస్తోందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కథ పరంగా ఆంధ్రకింగ్ ఉపేంద్ర అయినప్పటికీ తాలూకా అనే పదం రామ్ ని ఉద్దేశించిందే. తన పాత్రే హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు.
ఇక భాగ్యశ్రీ బోర్సేకు తగిన ప్రాధాన్యం దక్కిందని, రామ్ పోషించిన సాగర్ పాత్రకు ఆమెకు మధ్య పెట్టిన లవ్ స్టోరీ కథలో కీలక భాగం పోషిస్తుందట. దీని సక్సెస్ మీద చాలా నమ్మకం పెట్టుకున్న భాగ్యశ్రీకి కాంత ఫలితం నిరాశపరిచిన మాట వాస్తవం. కాకపోతే అందులో ఫస్ట్ హాఫ్ కే హత్యకు గురయ్యే క్యారెక్టర్ అయినప్పటికీ ఉన్నంతలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ అవకాశం కలిగించాడు. కర్నూలులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ మాట్లాడుతూ అందం అభినయం రెండూ ఉన్న నటిగా తన గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. మరి హిట్టు భాగ్యం ఆంధ్రకింగ్ కలిగిస్తాడో లేదో చూడాలి.
This post was last modified on November 19, 2025 3:15 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…