ఇప్పుడు దక్షిణాది హీరోల్లో యూత్ పరంగా మంచి డిమాండ్ ఉన్న వాళ్లలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రదీప్ రంగనాథన్. మీరు హీరో మెటీరియల్ కాదు కదా అని ఒక జర్నలిస్టు అడిగినా నవ్వుతూ హిట్టుతోనే సక్సెస్ కొట్టిన ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ ఇలా వరుసగా మూడు సూపర్ హిట్లే కాదు మూడు వంద కోట్ల బొమ్మలు ఖాతాలో వేసుకోవడంతో డిమాండ్ మాములుగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ సేతుపతి, ధనుష్ తర్వాత ఆ స్థానాన్ని తీసుకునేది ప్రదీప్ రంగనాధన్ అనేది అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇంత డిమాండ్ ఉందంటే మాటలా.
తన కొత్త సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 18 విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు ఎప్పుడో ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడా డేట్ కు రావడం అనుమానమేనని చెన్నై టాక్. డ్యూడ్ కన్నా చాలా ముందు మొదలై షూటింగ్ ఆలస్యమవుతూ పలు వాయిదాలు వేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాక మళ్ళీ పోస్ట్ పోన్ అంటే విచిత్రమే. ఇంకా ఓటిటి డీల్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్లే లేటవుతోందని యూనిట్ టాక్. ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ లవ్ ఫాంటసీ డ్రామాలో ఎస్జె సూర్య చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. హైలైట్స్ లో ఒకటిగా ఆయన్ని చెబుతున్నారు.
ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ దర్శకుడు విగ్నేష్ శివన్. నయనతార భర్తగా వెంటనే గుర్తు పడతాం కానీ ఒకప్పుడు మంచి హిట్లతో ట్రాక్ రికార్డు బాగానే ఉండేది. సూర్య లాంటి స్టార్లతో కూడా పని చేశాడు. అయితే ప్రదీప్ రంగనాథన్ లాంటి హాట్ కేక్ హీరోని చేతిలో పెట్టుకుని ఇంత జాప్యం చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. పైగా దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఈపాటికి బిజినెస్ అయిపోయి ఉండాలి. కానీ ఇలా మీనమేషాలు లెక్కేసుకుంటూ ఉంటే సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ తగ్గిపోతుంది. అది జరగకూడదనే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి టీమ్ మాటకు కట్టుబడి ఉంటుందో లేదో చూడాలి.
This post was last modified on November 18, 2025 2:42 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…