అదేంటీ పుష్పతో ఎవరికి ఎందుకు పోలిక, ఏమిటా లింక్ ఏమిటనుకుంటున్నారా. విషయం చదివితే మీకే అర్థమవుతుంది. మహేష్ బాబు వారణాసిలో విలన్ కుంభగా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన కొత్త సినిమా విలయత్ బుద్దా ఈ వారం విడుదల కానుంది. మళయాలంతో పాటు తెలుగు ట్రైలర్ కూడా వదిలారు. ట్విస్ట్ ఏంటంటే ఇది అచ్చం పుష్ప లాగే అనిపించడం. అడవులు, ఎర్ర చందనం స్మగ్లింగ్, పోలీసుల కళ్ళు గప్పడం, ఎత్తులు పై ఎత్తులు ఇలా చాలానే కనిపిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం ఎక్కడికి వెళ్లినా ఇంటర్వ్యూలు ఇచ్చినా పృథ్విరాజ్ సుకుమారన్ కు ఇదే ప్రశ్న ఎదురవుతోంది.
దానికాయన సవివరంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. పుష్ప రాక ముందే విలయత్ బుద్దాని ప్లాన్ చేసుకున్నారు. ప్రముఖ రచయిత జీఆర్ ఇందు గోపాలన్ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. అయ్యప్పనుం కోశియుమ్ దర్శకుడు సాచి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆయన 2020లో హఠాత్తుగా కన్ను మూశారు. ఆ బాధ్యతను సాచి అసిస్టెంట్ జయన్ నంబియార్ తీసుకున్నారు. ఇది ఓకే అనుకున్న టైంలో పుష్ప నిర్మాణంలో ఉందని కానీ అందులోనూ ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉందని కానీ పృథ్విరాజ్ బృందానికి తెలియలేదు. అలా షూటింగ్ ఆలస్యమైపోయి 2025 దాకా వచ్చేసింది.
కథ పరంగా ఎలాంటి పోలికలు ఉండవని, తను చేసిన డబుల్ మీనన్ క్యారెక్టర్ కు పుష్ప రాజ్ కు ఎక్కడా పొంతన ఉండదని అంటున్నారు. పృథ్విరాజ్ అన్నదాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే విలయత్ బుద్దా హీరో, పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే ఈగో క్లాష్ కాదు. ఇక్కడ వేరే సెటప్ ఉంటుంది. కాకపోతే అడవులు, దుంగలు లాంటి వ్యవహారాలు కొద్దిగా సేమ్ అనిపిస్తాయి. మరి పృథ్విరాజ్ అన్నట్టు ఒకవేళ అసలే మాత్రం పోలిక లేకపోతే ఇబ్బంది లేదు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ హిట్ చేసి ఇస్తారు. అలా కాదని ఏ మాత్రం సారూప్యతలు కనిపించినా అసలు సమస్య అక్కడ మొదలవుతుంది.
This post was last modified on November 17, 2025 10:40 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…