అదేంటీ పుష్పతో ఎవరికి ఎందుకు పోలిక, ఏమిటా లింక్ ఏమిటనుకుంటున్నారా. విషయం చదివితే మీకే అర్థమవుతుంది. మహేష్ బాబు వారణాసిలో విలన్ కుంభగా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన కొత్త సినిమా విలయత్ బుద్దా ఈ వారం విడుదల కానుంది. మళయాలంతో పాటు తెలుగు ట్రైలర్ కూడా వదిలారు. ట్విస్ట్ ఏంటంటే ఇది అచ్చం పుష్ప లాగే అనిపించడం. అడవులు, ఎర్ర చందనం స్మగ్లింగ్, పోలీసుల కళ్ళు గప్పడం, ఎత్తులు పై ఎత్తులు ఇలా చాలానే కనిపిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం ఎక్కడికి వెళ్లినా ఇంటర్వ్యూలు ఇచ్చినా పృథ్విరాజ్ సుకుమారన్ కు ఇదే ప్రశ్న ఎదురవుతోంది.
దానికాయన సవివరంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. పుష్ప రాక ముందే విలయత్ బుద్దాని ప్లాన్ చేసుకున్నారు. ప్రముఖ రచయిత జీఆర్ ఇందు గోపాలన్ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. అయ్యప్పనుం కోశియుమ్ దర్శకుడు సాచి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆయన 2020లో హఠాత్తుగా కన్ను మూశారు. ఆ బాధ్యతను సాచి అసిస్టెంట్ జయన్ నంబియార్ తీసుకున్నారు. ఇది ఓకే అనుకున్న టైంలో పుష్ప నిర్మాణంలో ఉందని కానీ అందులోనూ ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉందని కానీ పృథ్విరాజ్ బృందానికి తెలియలేదు. అలా షూటింగ్ ఆలస్యమైపోయి 2025 దాకా వచ్చేసింది.
కథ పరంగా ఎలాంటి పోలికలు ఉండవని, తను చేసిన డబుల్ మీనన్ క్యారెక్టర్ కు పుష్ప రాజ్ కు ఎక్కడా పొంతన ఉండదని అంటున్నారు. పృథ్విరాజ్ అన్నదాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే విలయత్ బుద్దా హీరో, పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే ఈగో క్లాష్ కాదు. ఇక్కడ వేరే సెటప్ ఉంటుంది. కాకపోతే అడవులు, దుంగలు లాంటి వ్యవహారాలు కొద్దిగా సేమ్ అనిపిస్తాయి. మరి పృథ్విరాజ్ అన్నట్టు ఒకవేళ అసలే మాత్రం పోలిక లేకపోతే ఇబ్బంది లేదు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ హిట్ చేసి ఇస్తారు. అలా కాదని ఏ మాత్రం సారూప్యతలు కనిపించినా అసలు సమస్య అక్కడ మొదలవుతుంది.
This post was last modified on November 17, 2025 10:40 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…