అదేంటీ పుష్పతో ఎవరికి ఎందుకు పోలిక, ఏమిటా లింక్ ఏమిటనుకుంటున్నారా. విషయం చదివితే మీకే అర్థమవుతుంది. మహేష్ బాబు వారణాసిలో విలన్ కుంభగా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన కొత్త సినిమా విలయత్ బుద్దా ఈ వారం విడుదల కానుంది. మళయాలంతో పాటు తెలుగు ట్రైలర్ కూడా వదిలారు. ట్విస్ట్ ఏంటంటే ఇది అచ్చం పుష్ప లాగే అనిపించడం. అడవులు, ఎర్ర చందనం స్మగ్లింగ్, పోలీసుల కళ్ళు గప్పడం, ఎత్తులు పై ఎత్తులు ఇలా చాలానే కనిపిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం ఎక్కడికి వెళ్లినా ఇంటర్వ్యూలు ఇచ్చినా పృథ్విరాజ్ సుకుమారన్ కు ఇదే ప్రశ్న ఎదురవుతోంది.
దానికాయన సవివరంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. పుష్ప రాక ముందే విలయత్ బుద్దాని ప్లాన్ చేసుకున్నారు. ప్రముఖ రచయిత జీఆర్ ఇందు గోపాలన్ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. అయ్యప్పనుం కోశియుమ్ దర్శకుడు సాచి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆయన 2020లో హఠాత్తుగా కన్ను మూశారు. ఆ బాధ్యతను సాచి అసిస్టెంట్ జయన్ నంబియార్ తీసుకున్నారు. ఇది ఓకే అనుకున్న టైంలో పుష్ప నిర్మాణంలో ఉందని కానీ అందులోనూ ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉందని కానీ పృథ్విరాజ్ బృందానికి తెలియలేదు. అలా షూటింగ్ ఆలస్యమైపోయి 2025 దాకా వచ్చేసింది.
కథ పరంగా ఎలాంటి పోలికలు ఉండవని, తను చేసిన డబుల్ మీనన్ క్యారెక్టర్ కు పుష్ప రాజ్ కు ఎక్కడా పొంతన ఉండదని అంటున్నారు. పృథ్విరాజ్ అన్నదాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే విలయత్ బుద్దా హీరో, పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే ఈగో క్లాష్ కాదు. ఇక్కడ వేరే సెటప్ ఉంటుంది. కాకపోతే అడవులు, దుంగలు లాంటి వ్యవహారాలు కొద్దిగా సేమ్ అనిపిస్తాయి. మరి పృథ్విరాజ్ అన్నట్టు ఒకవేళ అసలే మాత్రం పోలిక లేకపోతే ఇబ్బంది లేదు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ హిట్ చేసి ఇస్తారు. అలా కాదని ఏ మాత్రం సారూప్యతలు కనిపించినా అసలు సమస్య అక్కడ మొదలవుతుంది.
This post was last modified on November 17, 2025 10:40 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…