90వ దశకంలో అప్పటి తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన సినిమా.. అల్లరి ప్రియుడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణల మధ్య కెమిస్ట్రీ.. వారి మధ్య వచ్చిన పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి దీర్ఘ సుమంగళీభవ, బలరామకృష్ణులు తదితర చిత్రాల్లో నటించారు.
ఐతే 1998 తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. ఐతే సుదీర్ఘ విరామానంతరం ఈ జోడీని తెరపై చూడబోతున్నారు తెలుగు ప్రేక్షకులు. కొంచెం గ్యాప్ తర్వాత రాజశేఖర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో ఆయనకు జోడీగా రమ్యకృష్ణ నటించనుందట. తమిళ హిట్ మూవీ ‘లబ్బర్ పందు’కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కనుంది.
గ్రామీణ క్రికెట్ చుట్టూ తిరిగే ‘లబ్బర్ పందు’లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేయబోతున్నారట. పిట్టగోడ, 35 చిత్రాల్లో హీరోగా నటించిన విశ్వదేవ్ రాచకొండ మాతృకలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నాడు. రాజశేఖర్ తనయురాలే ఇందులో హీరోయిన్గా కనిపించనుంది. తమిళంలో శ్వాసిక చేసిన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.
రాజశేఖర్ చివరి చిత్రం ‘శేఖర్’ను డైరెక్ట్ చేసిన ఆయన భార్య జీవితనే ఈ బాధ్యతలు అందుకుంటుందేమో చూడాలి. ఒకప్పుడు రాజశేఖర్ రీమేక్ సినిమాలతోనే మంచి విజయాలు అందుకున్న మాట వాస్తవం కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న కథలతో ఆయన చేసిన గడ్డం గ్యాంగ్, శేఖర్ లాంటి చిత్రాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. ఈ అనుభవాల తర్వాత కూడా ఆయన మళ్లీ రీమేక్ రిస్క్కు రెడీ అవుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on November 17, 2025 6:39 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…