హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సిరీస్ కొనసాగిస్తూ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం నుంచి మొదటి ఆడియో సింగిల్ వచ్చేసింది. సినిమా విడుదల ఇంకో ఇరవై రోజుల్లో ఉండగా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఊరట కలిగిస్తూ తమన్ ఫస్ట్ సాంగ్ ఇచ్చాడు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ అరుదైన సింగింగ్ కాంబోలో కల్యాణ చక్రవర్తి సాహిత్యం సమకూర్చగా, గుడి గోపురాల మధ్య బాలయ్య తాండవం చేస్తుండగా చూపించిన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎక్కువగా మేకింగ్ దృశ్యాలను పొందుపరిచారు.
పాట ప్రారంభం అఖండ 1 తరహాలో మొదలుపెట్టినప్పటికీ క్రమంగా తమన్ తనదైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు. తెలుగు,సంస్కృతం కలగలిపి కూర్చిన పదాలు అర్ధవంతంగా ఉన్నాయి. ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఈ సాంగ్ లాంచ్ జరిగిపోయింది. అయితే ఇప్పుడు ట్రెండింగ్ వాతావరణం చూస్తుంటే ఇలాంటి పాట వైరల్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. పెద్ది చికిరి చికిరి లాగా ఫాస్ట్ బీట్ కాకపోవడంతో ఇలాంటి భక్తి పాటలు అసలు సినిమా రిలీజయ్యాక మరింత ఆదరణ పొందుతాయి. అఖండ 2 ప్రధాన ఉద్దేశం ఏంటో చెప్పేందుకే ప్రత్యేకించి ఈ గీతాన్ని విడుదల చేశారనుకోవచ్చు.
డిసెంబర్ 5 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని మరోసారి ఈ వీడియోలో స్పష్టం చేశారు. సో వచ్చే నెల తొలి వారంలో బాలయ్య ఊచకోత చూడొచ్చు. టైం దగ్గర పడుతుండటంతో టీమ్ పబ్లిసిటీని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కడి ఆడియన్స్ కాంతార, కార్తికేయ 2 లాంటి డివోషనల్ మూవీస్ కి ఇచ్చిన ఆదరణ చూసి అఖండ 2కి అంతకు మించిన స్పందన దక్కుతుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలున్నారు. ఏపీ తెలంగాణలో త్వరలో భారీ ఈవెంట్స్ చేయబోతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఇంకో వారం రోజుల్లో వెల్లడి కాబోతున్నాయి.
This post was last modified on November 14, 2025 6:56 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…