హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సిరీస్ కొనసాగిస్తూ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం నుంచి మొదటి ఆడియో సింగిల్ వచ్చేసింది. సినిమా విడుదల ఇంకో ఇరవై రోజుల్లో ఉండగా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఊరట కలిగిస్తూ తమన్ ఫస్ట్ సాంగ్ ఇచ్చాడు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ అరుదైన సింగింగ్ కాంబోలో కల్యాణ చక్రవర్తి సాహిత్యం సమకూర్చగా, గుడి గోపురాల మధ్య బాలయ్య తాండవం చేస్తుండగా చూపించిన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎక్కువగా మేకింగ్ దృశ్యాలను పొందుపరిచారు.
పాట ప్రారంభం అఖండ 1 తరహాలో మొదలుపెట్టినప్పటికీ క్రమంగా తమన్ తనదైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు. తెలుగు,సంస్కృతం కలగలిపి కూర్చిన పదాలు అర్ధవంతంగా ఉన్నాయి. ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఈ సాంగ్ లాంచ్ జరిగిపోయింది. అయితే ఇప్పుడు ట్రెండింగ్ వాతావరణం చూస్తుంటే ఇలాంటి పాట వైరల్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. పెద్ది చికిరి చికిరి లాగా ఫాస్ట్ బీట్ కాకపోవడంతో ఇలాంటి భక్తి పాటలు అసలు సినిమా రిలీజయ్యాక మరింత ఆదరణ పొందుతాయి. అఖండ 2 ప్రధాన ఉద్దేశం ఏంటో చెప్పేందుకే ప్రత్యేకించి ఈ గీతాన్ని విడుదల చేశారనుకోవచ్చు.
డిసెంబర్ 5 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని మరోసారి ఈ వీడియోలో స్పష్టం చేశారు. సో వచ్చే నెల తొలి వారంలో బాలయ్య ఊచకోత చూడొచ్చు. టైం దగ్గర పడుతుండటంతో టీమ్ పబ్లిసిటీని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కడి ఆడియన్స్ కాంతార, కార్తికేయ 2 లాంటి డివోషనల్ మూవీస్ కి ఇచ్చిన ఆదరణ చూసి అఖండ 2కి అంతకు మించిన స్పందన దక్కుతుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలున్నారు. ఏపీ తెలంగాణలో త్వరలో భారీ ఈవెంట్స్ చేయబోతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఇంకో వారం రోజుల్లో వెల్లడి కాబోతున్నాయి.
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…