తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టే ప్రతి పరభాషా నటుడు, టెక్నీషియన్ చెప్పే మాట ఒక్కటే. తెలుగు ప్రేక్షకులకు సినిమాల మీద ఉన్నంత ప్రేమ అసాధారణం.. వాళ్లను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అనే. ఈ మధ్య ఇది ఒక టెంప్లేట్ డైలాగ్లా మారిపోయింది. ఐతే చాలామంది తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి మొక్కుబడిగానే ఈ మాట అంటుంటారు.
కానీ దుల్కర్ సల్మాన్ ఆ కోవకు చెందిన వాడు కాదు. అతను ఏం మాట్లాడినా నిజాయితీగా ఉంటుంది. అతనెంత సిన్సియర్గా సినిమాలు చేస్తాడో తెలిసిందే. అంతే కాక తెలుగు చిత్రాలకు అతను ఇచ్చే ప్రాముఖ్యత ఎలాంటిదో కూడా అందరికీ అవగాహన ఉంది. తాజాగా అతను తమ సొంత వాళ్లయిన మలయాళ ప్రేక్షకులతో పోల్చి తెలుగు ఆడియన్స్ గొప్పదనం గురించి ఎలివేషన్ ఇచ్చాడు.
మలయాళంలో తనే కాక ఏ నటుడు అయినా ఒక రెండేళ్లు సినిమాలు చేయలేదంటే అతడి కథ ముగిసిందని.. సినిమాల నుంచి ఔట్ అని ఒక తీర్మానానికి వచ్చేస్తారని దుల్కర్ చెప్పాడు. తనకు కూడా ఆ అనుభవం ఎదురైందన్నాడు. కానీ తెలుగు ప్రేక్షకులు అలా కాదని దుల్కర్ చెప్పాడు. ఇలా అనుకోకుండా ఏ నటుడి కెరీర్లో అయినా గ్యాప్ వచ్చిందంటే.. ఎందుకు సినిమాలు చేయట్లేదు అని అడిగి, వాళ్లు మళ్లీ యాక్టివ్ అయ్యేలా ప్రోత్సహిస్తారని దుల్కర్ తెలిపాడు.
రానా దగ్గుబాటి కెరీర్లో ఇలాగే గ్యాప్ వస్తే.. మళ్లీ సినిమాలు చేయొచ్చు కదా, ఎందుకిలా గ్యాప్ తీసుకుంటున్నారు అని ప్రేక్షకులు తన వెంటపడడం తాను చూశానన్నాడు. ఇలాంటి ప్రేక్షకులు ఇంకెక్కడా ఉండరని.. తెలుగు వాళ్ల సినిమా ప్రేమ అసాధారణమైందని దుల్కర్ కొనియాడాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనుసు దోచిన దుల్కర్.. ఇప్పుడు ‘కాంత’తో బాక్సాఫీస్ బరిలో నిలిచాడు. ఈ చిత్రం శుక్రవారమే రిలీజవుతోంది. ఇందులో రానా కూడా నటించాడు. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా రానా, దుల్కర్లే కావడం విశేషం.
This post was last modified on November 13, 2025 7:07 pm
కాళ్లకు స్పోర్ట్స్ షూస్ లేవు.. ఒంటిపై ఖరీదైన క్రీడా దుస్తులు లేవు.. సాధారణ చీర, చెప్పులతోనే బరిలోకి దిగారు. పరుగులో…
సామాజిక కార్యక్రమాల విషయంలో చురుగ్గా ఉండే మెగా స్టార్ చిరంజీవి.. తరచుగా రక్తదానం, మొక్కల పెంపకం, పర్యావరణం గురించి ప్రజలకు,…
సినీ తారలు, సెలబ్రిటీలు, వీఐపీలు, అధికారులు క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్న సందర్భంలో వారిలో కొంతమంది ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ…
ఇరుముడి సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ తలలు పండిన నిర్మాతలను సైతం షాక్ కు గురి చేస్తోంది. పది రోజులకు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన నిర్మాణ సంస్థ. ఈ బేనర్ మీద కన్నడలో ముందు…
దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై స్లీపర్ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…