ఇవాళ సాయంత్రం కాంత ప్రీమియర్లు జరగబోతున్నాయి. కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న నిర్మాతలు తమిళ మీడియాకు నిన్నే షో వేశారు. సినిమా చాలా బాగుందంటూ, దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో పొగుడుతున్న వైనం అంచనాలు పెంచేస్తోంది. భాగశ్రీ బోర్సే, సముతిరఖనిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి కాంత తమిళ మూవీనే. మన దగ్గర డబ్బింగ్ వెర్షన్ రూపంలో వస్తోంది. కాకపోతే క్యాస్టింగ్ మనకు బాగా దగ్గరి వాళ్ళు కావడంతో అనువాదం అనే ఫీలింగ్ పెద్దగా కలగడం లేదు. ఇదే కాంతకు కీలకం కానుంది.
ఇక టాలీవుడ్ ప్రీమియర్ల నుంచి ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయనే దాని మీద టీమ్ ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే కాంతకిది మంచి ఛాన్స్. బాక్సాఫీస్ దగ్గర పెద్ద జోష్ లేదు. ప్రమోషన్లు విస్తృతంగా చేసిన ది గర్ల్ ఫ్రెండ్ వీకెండ్ కాగానే బాగా స్లో అయిపోయింది. నిన్న విజయ్ దేవరకొండను తీసుకొచ్చి ఈవెంట్ చేయడానికి కారణం కలెక్షన్ల బూస్ట్ కోసమే. టాక్ బాగున్నా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో జనాన్ని రప్పించడంలో విఫలమయ్యింది. జటాధర వాష్ అవుట్ కాగా ప్రణవ్ మోహన్ లాల్ డైస్ ఈరేని మనోళ్లు లైట్ తీసుకున్నారు. సో ఇప్పుడు పబ్లిక్ ని థియేటర్లకు రప్పించే బలమైన కంటెంట్ ఒకటి కావాలి.
రేపు కాంత సోలోగా రావడం లేదు. సంతాన ప్రాప్తిరస్తుకి ఓపెనింగ్స్ రాకపోయినా టాక్ తో పికప్ అవుతుందనే ధీమాలో దర్శక నిర్మాతలున్నారు. స్టార్ క్యాస్టింగ్ లేని ఇలాంటి వాటికి ఆడియన్స్ రెస్పాన్స్ చాలా కీలకం. ఇవి కాకుండా గత వైభవం, గోపి గాళ్ళ గోవా ట్రిప్, లవ్ ఓటిపి, జిగ్రీస్, సిమంతం లాంటి ఇతర సినిమాలు రేస్ లో ఉన్నాయి. అన్నీ టాక్ మీద ఆధారపడ్డవే. క్యాస్టింగ్ పరంగా అన్నింటికంటే పైచేయి కాంతదే కావడంతో బయ్యర్ల కళ్ళు దాని మీదే ఉన్నాయి. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కీలక పాత్ర పోషించిన దగ్గుబాటి రానా ఖచ్చితంగా విజయవంతమవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on November 13, 2025 3:12 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…