దక్షిణాదిన ప్రతి దర్శకుడు ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకునే హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. అలాంటి హీరోతో కేవలం రెండు సినిమాల అనుభవంతోనే పని చేసే అవకాశం దక్కించుకున్నాడు పా.రంజిత్. అతను అంతకుముందు తీసిన రెండు సినిమాలు కూడా మరీ పెద్ద సినిమాలు కూడా కాదు. వాటిని చూసి రజినీ అతడికి అవకాశం ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
కానీ రజినీ చేసిన కబాలి సినిమా ప్రోమోలతో రజినీ అభిమానుల్నే కాక అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు రంజిత్. కానీ ఆ అంచనాలను కబాలి ఎంతమాత్రం అందుకోలేకపోయింది. అయినా సరే.. రజినీ అతడికి మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఈసారి కాలాతోనూ అతను మెప్పించలేదు.
కాలా వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా రంజిత్ నుంచి కొత్త సినిమా ఏదీ రాలేదు. మధ్యలో రంజిత్ నిర్మాతగా మారి సినిమాలు తీశాడు కానీ.. మెగా ఫోన్ మాత్రం పక్కన పెట్టేశాడు. ఐతే ఎట్టకేలకు అతడి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. పేరు.. సర్పట్ట. ఆర్య హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు రంజిత్. ఆర్య ఈ మధ్య విపరీతంగా కండలు పెంచి నమ్మశక్యం కాని లుక్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అదంతా ఈ సినిమా కోసమే అని అర్థమవుతోంది.
బాక్సింగ్ రింగ్లో గండరగండడిలా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు ఆర్య. ఫస్ట్ లుక్ సెటప్ అంతా చూస్తే ఇదొక పీరియడ్ మూవీ అని.. కొన్ని దశాబ్దాల వెనకటి నేపథ్యంలో రంజిత్ సినిమా తీస్తున్నాడని అర్థమవుతోంది. కబాలి, కాలా మాదిరి సామాజిక ఇతివృత్తం కాకుండా ఈసారి రూటు మార్చి కమర్షియల్ సినిమానే తీసేలా కనిపిస్తున్నాడు రంజిత్.
This post was last modified on December 2, 2020 8:38 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…