తెలుగు సినిమా చరిత్రలో ‘మాయాబజార్’ చిత్రానిది ఎప్పటికీ ప్రత్యేక స్థానం. 1957లో వచ్చిన సినిమాను ఇప్పుడు చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ తరం ప్రేక్షకులకూ అది కనెక్ట్ అవుతుంది. ఆ సినిమాలో వాడిన సాంకేతికత గురించి ఎంత చెప్పినా తక్కువే. విశేషం ఏంటంటే.. దాదాపు ఏడు దశాబ్దాల కిందట తీసిన ఆ సినిమా కోసం ఉపయోగించి కెమెరాను ఇప్పుడు.. ఓ కొత్త చిత్రం కోసం వాడారట. ఆ చిత్రమే.. కాంత.
ఈ ఆశ్చర్యకర విషయాన్ని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగమైన రానా దగ్గుబాటి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘కాంత’ తమిళ తొలి తరం సూపర్ స్టార్లలో ఒకరైన ఎం.కె.త్యాగరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అవన్ని వాస్తవాలు కాదని టీం చెబుతూనే ఉంది. కేవలం ఆ సమయంలో జరిగిన పరిణామాలను ఉదాహరణగా తీసుకున్నవి మాత్రమే అని చెబుతున్నారు. అంటే ఈ కథ 1930-40 ప్రాంతంలో నడుస్తుందన్నమాట.
అప్పటి సినిమాలను గుర్తుకు తెచ్చేలా పాత కెమెరాలను వాడాల్సిన అవసరం ఏర్పడిందట. అందుకోసమే పాతాళ భైరవి, మాయాబజార్ చిత్రాల్లో వాడిన మిచెల్ కెమెరాను ఈ సినిమాలో వాడామని రానా వెల్లడించాడు. ట్రైలర్లో కూడా దీనికి సంబంధించిన ఒక షాట్ చూడొచ్చని రానా తెలిపాడు. తన తండ్రి సురేష్ బాబు ఒక సమయంలో వాహిని స్టూడియో నుంచి ఆ కెమెరాను తీసుకున్నట్లు రానా చెప్పాడు.
అంతే కాక ఆ రోజుల నాటి కార్లు, ఫోన్లు సహా అప్పటి సినిమా ఎక్విప్మెంట్ అంతా ఈ చిత్రంలో ఉపయోగించినట్లు రానా వెల్లడించాడు. దుల్కర్ సల్మాన్కు కార్ల మీద గొప్ప అవగాహన ఉందని.. అందుకే ఏ కాలంలో ఏ కారు వాడేవాళ్లో తనకున్న ఐడియాతో వాటినే తెప్పించడానికి ప్రయత్నించాడని.. అందుకోసం తాము చాలా కష్టపడాల్సి వచ్చిందని రానా తెలిపాడు. తమిళ దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్ రూపొందించిన ‘కాంత’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని రానా, దుల్కర్ కలిసి నిర్మించడం విశేషం.
This post was last modified on November 12, 2025 12:43 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…