సౌత్ ఇండియాలో కొన్నేళ్ల ముందు వరకు చూస్తే శంకర్, రాజమౌళిల తర్వాత ఆ స్థాయిని అందుకున్న దర్శకుడు మురుగదాస్. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్బస్టర్లతో అతను తిరుగులేని స్థాయిని అందుకున్నాడు. కానీ కత్తి తర్వాత అతను అంచనాలు అందుకోలేకపోయాడు. స్పైడర్, సర్కార్, దర్బార్ లాంటి ఫెయిల్యూర్లు ఇచ్చాడు.
దీంతో మురుగదాస్పై ఇంతకుముందు ఎంతో నమ్మకమున్న విజయ్ సైతం అతడికి హ్యాండిచ్చాడు. వీళ్లిద్దరి కలయికలో తుపాకి, కత్తి, సర్కార్ చిత్రాల తర్వాత మరో సినిమా రావాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సినిమా నుంచి ఇటీవల మురుగదాస్ తప్పుకున్నాడు. స్క్రిప్టు విషయంలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
ఐతే వరుస ఫెయిల్యూర్లకు తోడు ఇంత పెద్ద ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం మురుగదాస్ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతా అనుకున్నారు. కానీ అతను ఇంకా పెద్ద సినిమాను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. త్వరలోనే మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఫాక్స్ స్టార్ సంస్థతో మురుగదాస్కు మంచి సంబంధాలున్నాయి.
ఈ సంస్థ ఇండియా విభాగం మురుగదాస్తో కలిసి సినిమాలు నిర్మించింది కూడా. ఇప్పుడా సంస్థ నిర్మాణంలోనే మురుగదాస్ హాలీవుడ్ సినిమా తీయనున్నాడట. ఇది జంగిల్ బుక్, ది బ్యూటీ అండ్ ది బీస్ట్ తరహాలో లైవ్ యాక్షన్ యానిమేటెడ్ ఫిలిం అట. ఇలాంటి సినిమాలు తీసిన అనుభవం లేకపోయినప్పటికీ.. దానిపై కసరత్తు చేసి మురుగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. మురుగను నమ్మి ఇలాంటి ప్రాజెక్టును ఫాక్స్ స్టార్ అతడికి అప్పగించిందంటే విశేషమే.
This post was last modified on December 2, 2020 10:36 am
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…