సౌత్ ఇండియాలో కొన్నేళ్ల ముందు వరకు చూస్తే శంకర్, రాజమౌళిల తర్వాత ఆ స్థాయిని అందుకున్న దర్శకుడు మురుగదాస్. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్బస్టర్లతో అతను తిరుగులేని స్థాయిని అందుకున్నాడు. కానీ కత్తి తర్వాత అతను అంచనాలు అందుకోలేకపోయాడు. స్పైడర్, సర్కార్, దర్బార్ లాంటి ఫెయిల్యూర్లు ఇచ్చాడు.
దీంతో మురుగదాస్పై ఇంతకుముందు ఎంతో నమ్మకమున్న విజయ్ సైతం అతడికి హ్యాండిచ్చాడు. వీళ్లిద్దరి కలయికలో తుపాకి, కత్తి, సర్కార్ చిత్రాల తర్వాత మరో సినిమా రావాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సినిమా నుంచి ఇటీవల మురుగదాస్ తప్పుకున్నాడు. స్క్రిప్టు విషయంలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
ఐతే వరుస ఫెయిల్యూర్లకు తోడు ఇంత పెద్ద ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం మురుగదాస్ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతా అనుకున్నారు. కానీ అతను ఇంకా పెద్ద సినిమాను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. త్వరలోనే మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఫాక్స్ స్టార్ సంస్థతో మురుగదాస్కు మంచి సంబంధాలున్నాయి.
ఈ సంస్థ ఇండియా విభాగం మురుగదాస్తో కలిసి సినిమాలు నిర్మించింది కూడా. ఇప్పుడా సంస్థ నిర్మాణంలోనే మురుగదాస్ హాలీవుడ్ సినిమా తీయనున్నాడట. ఇది జంగిల్ బుక్, ది బ్యూటీ అండ్ ది బీస్ట్ తరహాలో లైవ్ యాక్షన్ యానిమేటెడ్ ఫిలిం అట. ఇలాంటి సినిమాలు తీసిన అనుభవం లేకపోయినప్పటికీ.. దానిపై కసరత్తు చేసి మురుగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. మురుగను నమ్మి ఇలాంటి ప్రాజెక్టును ఫాక్స్ స్టార్ అతడికి అప్పగించిందంటే విశేషమే.
This post was last modified on December 2, 2020 10:36 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…