నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో పరిచయమైన రోషన్ మేక డిసెంబర్ 25 ఛాంపియన్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి బ్యానర్ నిర్మాణం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించడం బిజినెస్ పరంగా హెల్ప్ అవుతోంది. ఇదిలా ఉండగా కెరీర్ పరంగా చాలా నెమ్మదిగా ఉన్న రోషన్ తన రెండో సినిమాకు ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదనేది నిజం. అయితే తను గత ఏడాదే మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభలో నటించేందుకు ఒప్పుకున్నాడు. అధికారిక ప్రకటన వచ్చింది. కొంత భాగం షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు.
తర్వాత తను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. విపరీతమైన జాప్యంతో పాటు పలు కారణాలు దీనికి దారి తీశాయని మల్లువుడ్ టాక్. ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు. నెలల క్రితమే రోషన్ స్థానంలో కన్నడ నటుడు సమర్జిత్ ని తీసుకుని రీ షూట్ చేసి మిగిలిన భాగం పూర్తి చేశారు. రిలీజ్ ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన వృషభ కొత్త డేట్ డిసెంబర్ 25. అంటే సరిగ్గా ఛాంపియన్ వస్తున్న అదే రోజు. వృషభలో మోహన్ లాల్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రెండో పాత్ర పేరు విశ్వంభర కావడం గమనార్హం. తండ్రి కొడుకుల మధ్య ఈగో వార్ గా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు.
ఇదంతా పక్కనపెడితే మోహన్ లాల్ సినిమాలో ఛాన్స్ వదులుకోవడం పైకి కరెక్ట్ కాదని అనిపించినా కెరీర్ ప్రారంభంలో హీరో కొడుకు లాంటి పాత్రలు చేయకపోవడమే బెటర్. ఒక స్థాయికి వచ్చాక ట్రై చేయొచ్చు కానీ రోషన్ ఇంకా నటుడిగా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అందుకే ఛాంపియన్ కూడా ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్నా ఓపిగ్గా సహకరించి వేరే కమిట్ మెంట్స్ ఇవ్వకుండా ఎదురు చూశాడు. ఒకవేళ వృషభలో కనక నిడివి తక్కువ ఉంటే లేనిపోని నెగటివ్ కామెంట్స్ వచ్చేవి. ఛాంపియన్ సక్సెస్ తర్వాత స్పీడ్ పెంచేందుకు కుర్రాడు రెడీగా ఉన్నాడట. చూడాలి అంతగా ఏముందో.
This post was last modified on November 9, 2025 2:10 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…