నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో పరిచయమైన రోషన్ మేక డిసెంబర్ 25 ఛాంపియన్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి బ్యానర్ నిర్మాణం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించడం బిజినెస్ పరంగా హెల్ప్ అవుతోంది. ఇదిలా ఉండగా కెరీర్ పరంగా చాలా నెమ్మదిగా ఉన్న రోషన్ తన రెండో సినిమాకు ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదనేది నిజం. అయితే తను గత ఏడాదే మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభలో నటించేందుకు ఒప్పుకున్నాడు. అధికారిక ప్రకటన వచ్చింది. కొంత భాగం షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు.
తర్వాత తను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. విపరీతమైన జాప్యంతో పాటు పలు కారణాలు దీనికి దారి తీశాయని మల్లువుడ్ టాక్. ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు. నెలల క్రితమే రోషన్ స్థానంలో కన్నడ నటుడు సమర్జిత్ ని తీసుకుని రీ షూట్ చేసి మిగిలిన భాగం పూర్తి చేశారు. రిలీజ్ ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన వృషభ కొత్త డేట్ డిసెంబర్ 25. అంటే సరిగ్గా ఛాంపియన్ వస్తున్న అదే రోజు. వృషభలో మోహన్ లాల్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రెండో పాత్ర పేరు విశ్వంభర కావడం గమనార్హం. తండ్రి కొడుకుల మధ్య ఈగో వార్ గా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు.
ఇదంతా పక్కనపెడితే మోహన్ లాల్ సినిమాలో ఛాన్స్ వదులుకోవడం పైకి కరెక్ట్ కాదని అనిపించినా కెరీర్ ప్రారంభంలో హీరో కొడుకు లాంటి పాత్రలు చేయకపోవడమే బెటర్. ఒక స్థాయికి వచ్చాక ట్రై చేయొచ్చు కానీ రోషన్ ఇంకా నటుడిగా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అందుకే ఛాంపియన్ కూడా ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్నా ఓపిగ్గా సహకరించి వేరే కమిట్ మెంట్స్ ఇవ్వకుండా ఎదురు చూశాడు. ఒకవేళ వృషభలో కనక నిడివి తక్కువ ఉంటే లేనిపోని నెగటివ్ కామెంట్స్ వచ్చేవి. ఛాంపియన్ సక్సెస్ తర్వాత స్పీడ్ పెంచేందుకు కుర్రాడు రెడీగా ఉన్నాడట. చూడాలి అంతగా ఏముందో.
This post was last modified on November 9, 2025 2:10 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…