నిన్న హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ గ్రాండ్ గా జరిగింది. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులతో కోలాహల వాతావరణం నెలకొంది. ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా పెద్ది టీమ్ నిలిచింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు ముగ్గురూ హాజరై చికిరి చచికిరి సాంగ్ కొచ్చిన రెస్పాన్స్ పట్ల తమ ఆనందాన్ని పంచుకున్నారు. చరణ్ గెటప్, స్వాగ్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈవెంట్ కు హాజరైన జనాల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు పాటలు చాలా తక్కువ పాడటం ఒక కారణమైతే మూడు గంటలలోపే మొత్తం ప్రోగ్రాం అయిపోవడం కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ కి దారి తీసింది.
రెహమాన్ ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి కారణం లేకపోలేదు. తెలుగులో ఆయన చేసిన స్ట్రెయిట్ సినిమాలు మ్యూజిక్ పరంగా పెద్దగా అద్భుతాలు చేయలేదు. పల్నాటి పౌరుషం, గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్ నుంచి కొమరం పులి దాకా ఎన్నో ఉదాహరణలున్నాయి. అందుకే తమిళ, హిందీకి ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమికుడు, రోజా, బొంబాయి, భారతీయుడు లాంటివి డబ్బింగ్ వెర్షన్లు ఒరిజినల్ తో పోటీ పడేలా ఉంటాయి. అలాంటప్పుడు రెహమాన్ వాటిని తెలుగు సాహిత్యంతోనే పాడవచ్చు. కానీ ఇలా అలవాటు లేకపోవడంతో తక్కువ టాలీవుడ్ సాంగ్స్ తో సరిపెట్టారని నిర్వాహకుల నుంచి వినిపిస్తున్న మాట.
ఓవరాల్ గా చెప్పాలంటే రెహమాన్ కన్సర్ట్ బ్లాక్ బస్టర్ కాలేకపోయిందని సమాచారం. వీరాభిమానులు సంతృప్తి చెందినప్పటికీ మ్యూజిక్ లవర్స్ మాత్రం పలు విషయాల్లో అసంతృప్తికి గురైన వైనం సోషల్ మీడియాలో గమనించవచ్చు. వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నప్పుడు అంచనాలు ఎక్కువగా ఉండటం సహజం. నూటా యాభై రూపాయల టికెట్, రెండు గంటల సినిమాకే ఎక్కువ హైప్ పెట్టుకునే ప్రేక్షకులు ఇలాంటి ఈవెంట్స్ నుంచి ఇంకా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు అసంతృప్తులు వినిపిస్తాయి. ఇదంతా ఎలా ఉన్నా చికిరి చికిరిని లైవ్ గా స్టేజి మీద పెర్ఫార్మ్ చేయడం పబ్లిక్ ని ఆకట్టుకుంది.
This post was last modified on November 9, 2025 1:12 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…