Movie News

మేఘాలయ అందాల్లో మునిగిపోతున్న ‘బా బా బ్లాక్ షీప్‌’

చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్‌’ షూటింగ్ మేఘాలయలో వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత వేణు దోనేపూడి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ చిత్రంలో టిన్ను ఆనంద్‌, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరిఅన్‌, రాజా రవీంద్ర‌, అక్షయ్ లఘుసాని, విష్ణు ఓ ఐ, కార్తికేయ దేవ్‌, కశ్యప్‌, విస్మయ‌, మాల్వి మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరిస్తున్న తొలి సినిమా ఇదే. ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా గన్స్, గోల్డ్, హంట్ చుట్టూ తిరుగుతుంది. ఆరుగురు పాత్రల మధ్య సాగే ఆసక్తికరమైన కథ ఇది.

వేణు దోనేపూడి మాట్లాడుతూ, “మేఘాలయలో పూర్తి స్థాయిలో షూట్ చేస్తున్న మొదటి సినిమా ఇది. కథ నార్త్ ఈస్ట్ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి ఇక్కడే షూట్ చేస్తున్నాం. ఇక్కడి ప్రకృతి అందాలు, జలపాతాలు, కొండలు అన్నీ మా కథకు బాగా సరిపోయాయి” అని చెప్పారు.

ఎల్లప్పుడూ వర్షం పడే సోహ్రా (చిరపుంజి) ప్రాంతంలో సినిమా చిత్రీకరిస్తున్నారు. వర్షం కారణంగా షూటింగ్ కష్టంగా ఉన్నప్పటికీ, టీమ్ ఎంతో కృషి చేస్తోందని వేణు తెలిపారు. “ఇది ప్రేక్షకులకు కనువిందు చేసే సినిమా అవుతుంది” అని అన్నారు.

చిత్రాలయం స్టూడియోస్ మేఘాలయ ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. ఇటీవల మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా సినిమా టీమ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త దర్శకుడు గుణ మంచికంటి ను పరిచయం చేస్తూ ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తోంది. అద్భుతమైన కథ, అందమైన లొకేషన్లు, యూనిట్ కృషి కలిసి ‘బా బా బ్లాక్ షీప్‌’ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి.

Satya

Recent Posts

బహదూర్ VS బంధం – ఆషామాషీ పోటీ కాదు

స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…

2 hours ago

కిచిడీ కామెడీకి వంద కోట్ల వసూళ్లు

దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…

2 hours ago

తారక్ & త్రివిక్రమ్… యుద్ధం మొదలుకానుంది

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…

3 hours ago

ఇరుముడికి పొంచి ఉన్న రెండు ముప్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…

3 hours ago

సూర్య సరైన దారిలోకి వచ్చినట్టే

ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…

4 hours ago

తూచ్… అమరావతికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదా?

అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…

6 hours ago