ఇప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా బోలెడంత మంది పాప్ సింగర్స్ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. కానీ ఓ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. ప్రపంచమంతా ఒక సింగర్ పేరెత్తితే చాలు వెర్రెత్తిపోయేది. టీనేజీలోనే ప్రపంచ సంగీత ప్రియులందరినీ ఊపేస్తూ అంతకుముందు, ఆ తర్వాత ఎవ్వరికీ సాధ్యం కాని ఫాలోయింగ్ను సంపాదించిన ఆ లెజెండరీ మ్యూజిక్ ఆర్టిస్టే మైకేల్ జాక్సన్. సింగర్గా, డ్యాన్సర్గా, మ్యుజీషియన్గా అతను ఆవిష్కరించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సంగీత ప్రపంచం తన నుంచి ఇంకా ఎంతో ఆశిస్తున్న సమయంలో, 2009లో 51 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తాడు మైకేల్. అతను చనిపోయిన వెంటనే ‘దిస్ ఈజ్ ఇట్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే దానికి మంచి స్పందనే వచ్చింది.
ఐతే ఇప్పుడు మైకేల్ జాక్సన్ జీవితం మొత్తాన్ని ఒక బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగింది. ‘మైకేల్’ పేరుతో ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రాన్ని రూపొందించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ఈ సినిమా వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. అచ్చం మైకేల్ జాక్సన్ లాగే ఉన్న ఆర్టిస్టును తీసుకుని.. సరైన మేకప్ వేసి ఈ పాత్ర చేయించినట్లున్నారు. మైకేల్ డ్యాన్సులను కూడా అతను దించేశాడు. కొన్ని మూమెంట్స్ చూస్తే మైకేల్ అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయనడంలో సందేహం లేదు. సినిమా కూడా అద్భుతంగా ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది ఈ గ్లింప్స్. మైకేల్ను ఇష్టపడే ప్రతి అభిమానికీ ఇది ఒక గొప్ప జ్ఞాపకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియాలో కూడా ఎంజేకు భారీగా అభిమాన గణం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తునే ఈ సినిమా రిలీజ్ కావచ్చు.
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…