బండ్ల గణేష్.. గత కొన్ని వారాల్లో టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశం అయిన పేరు ఇదే. ముందుగా లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో హీరో మౌళిని కొనియాడుతూ ఇండస్ట్రీలో మాఫియా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతే కాక అల్లు అరవింద్ మీద పంచ్లు వేయడమే కాక.. మహేష్ బాబు, విజయ్ దేవరకొండల గురించి కూడా చిన్న నెగెటివ్ కామెంట్ చేశాడు బండ్ల. దీని మీద పెద్ద దుమారమే రేగింది.
ఇది కాస్త సద్దుమణిగే లోపే తాజాగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ‘కే ర్యాంప్’ సక్సెస్ మీట్లో తీవ్ర వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. కొందరు ఒక హిట్టు పడగానే లూజు లూజు ప్యాంట్లేసుకుని.. కళ్ళజోడు, టోపీ పెట్టుకుని..‘వాట్సాప్ వాట్సాప్’ అంటూ స్టేజిమీద రెచ్చిపోయి తిరుగుతుంటారు.. అంటూ బండ్ల చేసిన కామెంట్ దుమారం రేపింది. పేరు పెట్టకపోయినా ఈ కామెంట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించే అని అందరికీ అర్థం అయిపోయింది. విజయ్ ఫ్యాన్స్ బండ్లను టార్గెట్ చేశారు.
కష్టపడి సొంతంగా హీరోగా ఎదిగిన విజయ్ మీద ఈ కామెంట్స్ ఏంటని.. ఒక పెద్ద ఫ్యామిలీ హీరో మీద ఇలా మాట్లాడగలరా అని బండ్ల తీరును దుయ్యబట్టారు. తన కామెంట్స్ బాగా నెగెటివిటీ తెచ్చి పెట్టడంతో బండ్ల రెండు రోజుల గ్యాప్ తర్వాత రెస్పాండ్ అయ్యాడు. “ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే” అని తన ఎక్స్ హ్యాండిల్లో పెట్టిన పోస్టులో బండ్ల గణేష్ పేర్కొన్నాడు.
ఈ పోస్ట్ చూశాక అడుసు తొక్కనేల, కాలు కడగనేల అనే సామెత గుర్తుకు వస్తోంది. బండ్ల ఇలా వరుసగా వివాదాస్పద కామెంట్స్ చేస్తుండడంతో ఇకపై ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా ఈవెంట్ కి ఆయన్ని పిలవాలంటే సంకోచించే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బండ్ల నిన్ననే ఇలాంటి క్లారిఫికేషన్ పోస్టు ఇంకోటి పెట్టాడు. తాను చిరంజీవితో సినిమా తీయబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు.
This post was last modified on November 5, 2025 5:00 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…