Movie News

అరవింద్ ఛాలెంజ్.. రేటింగ్ తక్కువ ఇవ్వలేరు

ఈ శుక్రవారం రిలీజవుతున్న కొత్త చిత్రాల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ.. ది గర్ల్ ఫ్రెండ్. యానిమల్, పుష్ప-2 లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీని ఒప్పుకుని అందరికీ షాకిచ్చింది రష్మిక. ఈ మూవీ టీజర్, ట్రైలర్ ట్రెండీగా, బోల్డ్‌గా అనిపించాయి. మోడర్న్ రిలేషన్‌షిప్స్ మీద కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకుని ఇంట్రెస్టింగ్ మూవీ తీసినట్లే ఉన్నాడు యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.

ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ గురించి ప్రి రిలీజ్ ప్రెస్ మీట్ ఈవెంట్లో అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇవ్వడానికి సమీక్షకులు ఇబ్బంది పడతారని ఆయనన్నారు. తాము ప్రొడ్యూస్ చేసే సినిమాలకు 1.5 నుంచి 3.5 వరకు రేటింగ్స్ వస్తుంటాయని.. కానీ ఈ సినిమాకు మాత్రం తక్కువ రేటింగ్ ఇవ్వడం కష్టమని.. ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమా అని ఆయనన్నారు.

సినిమా ఆడనీ, ఆడనివ్వకపోనీ.. రేటింగ్ మాత్రం తక్కువ పడదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రి రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ అతిథిగా వస్తారనే ప్రచారం నిజం కాకపోవడంపై అడిగిన ప్రశ్నకు అరవింద్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రష్మికనే రాలేదని.. అలాంటపుడు విజయ్ ఎలా వస్తాడని ఆయనన్నారు. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్‌కు విజయ్‌ని తీసుకొస్తామని ఆయనన్నారు.

తన ప్రొడక్షన్లో భారీ చిత్రాలు రాకపోవడం గురించి ఆయన భలే చమత్కారంగా సమాధానం ఇచ్చారు. అలాంటి పెద్ద సినిమాలు తీయాలంటే బన్నీతో, చరణ్‌తోనే చేయాలని.. వాళ్లతో చేస్తే పెద్ద పారితోషకాలు ఇవ్వాలని.. తిరిగి అవి తమ ఇంటికే వస్తాయని.. అలా కాకుండా వాళ్లు వేరే వాళ్లతో సినిమాలు చేస్తే బయటి డబ్బులు ఇంటికి వస్తాయని.. అదే బెటర్ కదా అని ఆయన చమత్కరించారు.

This post was last modified on November 5, 2025 4:28 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

7 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago