అన్నం ఉడికిందో లేదో తెలియడానికి చిన్న మెతుకు చాలన్నట్టు కొన్నిసార్లు పాటలు ఎలా ఉండబోతున్నాయో చెప్పేందుకు చిన్న బిట్ చాలు. పెద్ది అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఎంత ఆనందపడ్డారో ఫామ్ తగ్గిపోయిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అనగానే అంతే టెన్షన్ పడ్డారు. ఎందుకంటే తమిళంలో అదిరిపోయే ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన రెహమాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ఆ స్థాయి కంటెంట్ ఇవ్వలేకపోయారు. అందుకే పెద్ది విషయంలో కొంత ఆందోళన రేగింది. ఇవాళ దర్శకుడు బుచ్చిబాబు తనదైన స్టయిల్ లో చికిరి చికిరి డేట్ ప్రకటనతో దాన్ని తగ్గించేశారు.
రెహమాన్ తో సరదాగా సంభాషణ మొదలుపెట్టి తనకు కావాల్సిన సిచువేషన్ ని వివరించి చికిరి చికిరి పదంతోనే పాట కంపోజ్ చేయమని చెప్పడం కొత్తగా అనిపించింది. ఇలా ఎవరూ చేయలేదని కాదు కానీ రెహమాన్ పాల్గొనడం మాత్రం మొదటిసారని చెప్పొచ్చు. వీడియో చివర్లో రామ్ చరణ్ మంచి గ్రేస్ తో వేసిన డిఫరెంట్ స్టెప్ అభిమానులు రిపీట్ గా చూసేలా ఉంది. రెహమాన్ క్యాచీగా ట్యూన్ కంపోజ్ చేసిన విధానం, మోహిత్ చౌహాన్ గాత్రం కొత్తగా ఉన్నాయి. నవంబర్ 7 విడుదల కాబోయే ఫుల్ సాంగ్ విన్నాక మరింత క్లారిటీ వస్తుంది కానీ మొత్తానికి ఎదురు చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యింది.
మార్చి 27 విడుదల కాబోతున్న పెద్ది కోసం బుచ్చిబాబు చేసుకుంటున్న ప్రమోషన్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఫస్ట్ షాట్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒక్క నిమిషం వీడియోతో బిజినెస్ ఆఫర్లు రెట్టింపు అయ్యేలా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పాటలతో కొత్త హడావిడి మొదలుపెట్టబోతున్నారు. ఏది ఏమైనా రెహమాన్ మీద మునుపటి నమ్మకం వచ్చేలా చేస్తే చాలనేది మ్యూజిక్ లవర్స్ కోరిక. ఆయన్ను విపరీతంగా అభిమానించే బుచ్చిబాబు ఖచ్చితంగా అంత అవుట్ ఫుట్ రాబట్టుకుంటాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దానికి ఫస్ట్ షాట్, చికిరి చికిరి గట్టి పునాది వేశాయి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…