Movie News

సినిమాలో లేని పాటకోసం కోటి రూపాయలా…

సినిమాల ప్రమోషన్‌ను కొత్త పుంతలు తొక్కించే క్రమంలో కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలని చూస్తుంటాయి చిత్ర బృందాలు. ప్రమోషనల్ సాంగ్స్ చేసి రిలీజ్ చేయడం ఇందులో భాగమే. ఆ పాటలు సినిమాలో కూడా ఉండవు. కేవలం ప్రమోషన్లకే పరిమితం అవుతుంటాయి. ఇలాంటి పాటల్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతోనే తీయాలని చూస్తారు. 

కానీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే చిన్న సినిమా కోసం చేసిన ప్రమోషనల్ సాంగ్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టేసిందట టీం. కొన్ని నెలల కిందటే సినిమా నుంచి ‘నదివే’ అంటూ సాగే ఒక ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశామంటూ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి అంత బడ్జెట్ అవుతుందని ఊహించలేదని.. కానీ కమిటయ్యాం కనుక ఆ పాట చేయాల్సి వచ్చిందని ధీరజ్ తెలిపాడు.

ఈ సినిమా నుంచి తొలి పాట రిలీజ్ చేద్దాం అనుకున్నపుడు.. రొటీన్‌గా ఎందుకు చేయాలని ఆలోచించామన్నాడు ధీరజ్. లిరికల్ వీడియో అంటూ అందరూ ఒకేలా చేస్తారని.. అలా కాకుండా భిన్నంగా ఏదైనా చేద్దాం అని ఆలోచించి ప్రమోషనల్ సాంగ్ చేద్దాం.. దాన్ని షూట్ చేసి రిలీజ్ చేద్దాం అని తనే దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు ఐడియా ఇచ్చినట్లు ధీరజ్ తెలిపాడు. 

కాన్సెప్ట్ అనుకున్నాక దానికి ఏర్పాట్లు జరిగాయని.. షూట్‌కు రెండు రోజుల ముందు దాని కోసం ప్రొడక్షన్ టీం బడ్జెట్ వేసి చూపించిందని.. అది చూసి తాను షాకయ్యానని ధీరజ్ తెలిపాడు. ఏకంగా కోటి రూపాయలు ఆ పాట కోసం ఖర్చు చేశామని.. తీరా చూస్తే ఆ పాట సినిమాలో ఉండదని.. ప్రమోషన్లకే పరిమితమవుతుందని అతను చెప్పాడు. కానీ చేయాలి అనుకున్నాం కాబట్టి ఆ పాట పూర్తి చేశామని ధీరజ్ తెలిపాడు. రష్మిక, ధీరజ్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

33 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago