దర్శకులతో సత్సంబంధాలు కొనసాగించే మహేష్ బాబుకి ఆమధ్య కొందరు దర్శకులతో పొరపొచ్చాలొచ్చాయి. త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, సుకుమార్ లాంటి దర్శకులతో అభిప్రాయబేధాలు రావడంతో వారితో మరో చిత్రం చేయడానికి మహేష్ ఆసక్తి చూపించలేదు. కానీ ఈ కరోనా లాక్డౌన్లో మహేష్ అలా దూరమైన వాళ్లందరినీ తిరిగి దగ్గర చేసుకున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్తో త్వరలోనే ఒక సినిమా వుంటుందని అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి మహేష్ సిద్ధంగా వున్నాడు.
అలాగే పూరి జగన్నాధ్కి కూడా మహేష్ అభయం ఇచ్చినట్టు టాక్. తనకు నచ్చే కథ తీసుకుని వస్తే జగన్కి డేట్స్ ఇస్తానని మహేష్ చెప్పాడట. తాజాగా సుకుమార్తో కూడా మహేష్కి వున్న డిఫరెన్సెస్ తొలగిపోయాయని, ఈసారి మంచి కథ తీసుకుని రమ్మని సుక్కూకి చెప్పాడని వార్తలొస్తున్నాయి. పుష్ప కథను మహేష్ కోసమే సుకుమార్ రెడీ చేసాడు. అయితే మహేష్ ఆ కథలో మార్పులు చెప్పి ఆలోగా అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేయడం సుకుమార్కి నచ్చలేదు. దాంతో ఇక అతడితో మళ్లీ పని చేయననే అర్థం వచ్చేలా మహేష్ ట్వీట్ పెట్టాడు. కానీ ఇప్పుడు వారిమధ్య వున్న దూరం తొలగిపోయిందట. త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందట.
This post was last modified on November 30, 2020 8:56 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…