దర్శకులతో సత్సంబంధాలు కొనసాగించే మహేష్ బాబుకి ఆమధ్య కొందరు దర్శకులతో పొరపొచ్చాలొచ్చాయి. త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, సుకుమార్ లాంటి దర్శకులతో అభిప్రాయబేధాలు రావడంతో వారితో మరో చిత్రం చేయడానికి మహేష్ ఆసక్తి చూపించలేదు. కానీ ఈ కరోనా లాక్డౌన్లో మహేష్ అలా దూరమైన వాళ్లందరినీ తిరిగి దగ్గర చేసుకున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్తో త్వరలోనే ఒక సినిమా వుంటుందని అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి మహేష్ సిద్ధంగా వున్నాడు.
అలాగే పూరి జగన్నాధ్కి కూడా మహేష్ అభయం ఇచ్చినట్టు టాక్. తనకు నచ్చే కథ తీసుకుని వస్తే జగన్కి డేట్స్ ఇస్తానని మహేష్ చెప్పాడట. తాజాగా సుకుమార్తో కూడా మహేష్కి వున్న డిఫరెన్సెస్ తొలగిపోయాయని, ఈసారి మంచి కథ తీసుకుని రమ్మని సుక్కూకి చెప్పాడని వార్తలొస్తున్నాయి. పుష్ప కథను మహేష్ కోసమే సుకుమార్ రెడీ చేసాడు. అయితే మహేష్ ఆ కథలో మార్పులు చెప్పి ఆలోగా అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేయడం సుకుమార్కి నచ్చలేదు. దాంతో ఇక అతడితో మళ్లీ పని చేయననే అర్థం వచ్చేలా మహేష్ ట్వీట్ పెట్టాడు. కానీ ఇప్పుడు వారిమధ్య వున్న దూరం తొలగిపోయిందట. త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందట.
This post was last modified on November 30, 2020 8:56 pm
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…