Movie News

అందరినీ మచ్చిక చేసుకుంటోన్న మహేష్‍ బాబు

దర్శకులతో సత్సంబంధాలు కొనసాగించే మహేష్‍ బాబుకి ఆమధ్య కొందరు దర్శకులతో పొరపొచ్చాలొచ్చాయి. త్రివిక్రమ్‍, పూరి జగన్నాధ్‍, సుకుమార్‍ లాంటి దర్శకులతో అభిప్రాయబేధాలు రావడంతో వారితో మరో చిత్రం చేయడానికి మహేష్‍ ఆసక్తి చూపించలేదు. కానీ ఈ కరోనా లాక్‍డౌన్‍లో మహేష్‍ అలా దూరమైన వాళ్లందరినీ తిరిగి దగ్గర చేసుకున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్‍తో త్వరలోనే ఒక సినిమా వుంటుందని అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్‍ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి మహేష్‍ సిద్ధంగా వున్నాడు.

అలాగే పూరి జగన్నాధ్‍కి కూడా మహేష్‍ అభయం ఇచ్చినట్టు టాక్‍. తనకు నచ్చే కథ తీసుకుని వస్తే జగన్‍కి డేట్స్ ఇస్తానని మహేష్‍ చెప్పాడట. తాజాగా సుకుమార్‍తో కూడా మహేష్‍కి వున్న డిఫరెన్సెస్‍ తొలగిపోయాయని, ఈసారి మంచి కథ తీసుకుని రమ్మని సుక్కూకి చెప్పాడని వార్తలొస్తున్నాయి. పుష్ప కథను మహేష్‍ కోసమే సుకుమార్‍ రెడీ చేసాడు. అయితే మహేష్‍ ఆ కథలో మార్పులు చెప్పి ఆలోగా అనిల్‍ రావిపూడితో సినిమా అనౌన్స్ చేయడం సుకుమార్‍కి నచ్చలేదు. దాంతో ఇక అతడితో మళ్లీ పని చేయననే అర్థం వచ్చేలా మహేష్‍ ట్వీట్‍ పెట్టాడు. కానీ ఇప్పుడు వారిమధ్య వున్న దూరం తొలగిపోయిందట. త్వరలోనే ఈ కాంబినేషన్‍లో సినిమా వస్తుందట.

This post was last modified on November 30, 2020 8:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగ్ అశ్విన్‌ను డిప్రెషన్లోకి నెట్టిన ‘ఇన్సెప్షన్’

డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…

7 hours ago

ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ సిటీ.. నది తీరాన అత్యంత భారీగా..

ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…

7 hours ago

ట్రంప్ టారిఫ్ లను తట్టుకున్న ఏకైక మార్కెట్ మనదే..

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…

8 hours ago

లాభం లేదబ్బాయ్….రూటు మార్చెయ్

హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…

8 hours ago

అంతరిక్షంలో ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…

8 hours ago

దేశంలో తొలిసారిగా మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయనున్న రోబో

మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…

9 hours ago