ఈ మధ్య కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారిన అంశం కుల గొడవల సినిమాలు. ముఖ్యంగా ధృవ్ విక్రమ్ బైసన్ రిలీజయ్యాక ఈ చర్చ మరింత విస్తృతమయ్యింది. మారి సెల్వరాజ్, పా రంజిత్ లాంటి దర్శకులు తమను అదే పనిగా టార్గెట్ చేయడం పట్ల ఓపెన్ గా కామెంట్స్ చేస్తూ కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి మూడు వందల కమర్షియల్ సినిమాలు వస్తున్నాయని, వాటిని వదిలేసి కేవలం తమ ముగ్గురిని కామెంట్ చేయడం పట్ల వెట్రిమారన్ ని కలుపుకుని పా పంజిత్ అన్న మాటలు డిస్కషన్ కు దారి తీశాయి. క్యాస్ట్ బేస్డ్ మూవీస్ వద్దంటున్న సోషల్ మీడియా బ్యాచ్ పెద్దదే ఉంది.
కాకపోతే తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు తక్కువే. అప్పుడెప్పుడో సప్తపది, జయం మనదేరా లాంటి చిత్రాల్లో ఈ కులాల గురించి టచ్ చేశారు కానీ గత కొన్నేళ్లలో ఎవరూ వీటి జోలికి వెళ్ళలేదు. సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టులో ఈ సున్నితమైన అంశాన్ని టచ్ చేసినట్టు తాజాగా ఇచ్చిన ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో స్వయంగా హీరోనే చెప్పేశాడు. కింది కులాల మీద అగ్ర కులాలు దారుణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పుడు జరిగే పరిణామాలను ఇందులో చూపించబోతున్నట్టు చెప్పాడు. ఇంకేముంది తమిళ అభిమానుల సంఘం ఇప్పుడీ పాయింట్ ని పట్టుకుని ఎక్స్, ఇన్స్ టాలో డిస్కషన్లు మొదలుపెట్టేలా ఉంది.
ఒకప్పటిలా కాకపోయినా అంతో ఇంతో కుల వివక్ష సమాజంలో ఇంకా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రూపు మాసిపోలేదు. అందుకే తరచుగా ఈ కాన్సెప్ట్స్ కి టచ్ చేస్తున్న దర్శకులు లేకపోలేదు. ఇదంతా ఓకే కానీ సంబరాల ఏటిగట్టు విడుదల తేదీ వ్యవహారం మాత్రం ఇంకా తేలలేదు. డిసెంబర్ ఛాన్స్ దాదాపు లేనట్టే. సంక్రాంతికి స్లాట్ ఖాళీగా లేదు. జనవరి నెలాఖరు ఆప్షన్ ఉంది కానీ ఇంత పెద్ద బడ్జెట్ కి రిస్క్ అవ్వొచ్చు. మార్చి నుంచి వరసగా పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్, విశ్వంభరలున్నాయి. వీటికన్నా ముందే వచ్చేయాలి. మరి ఫిబ్రవరిలో ఏమైనా వచ్చే ఆలోచన చేస్తుందేమో ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి.
This post was last modified on October 29, 2025 5:27 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…