బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టేలా ఉంది. క్రేజ్ ఉంటుందని ముందే ఊహించినప్పటికీ ఈ స్థాయి రెస్పాన్స్ బయ్యర్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతోంది. 3 గంటల 44 నిమిషాల నిడివిని లెక్క చేయకుండా బిగ్గెస్ట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం రెడీ అవుతున్న ఆడియన్స్ అక్టోబర్ 30 సాయంత్రం ప్రీమియర్ షోల నుంచే హడావిడి చేయబోతున్నారు. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో అమ్ముడైన టికెట్లు అక్షరాలా 52 వేలకు పైమాటే. ఒక్క హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే 12 వేల టికెట్లు అమ్ముడుపోయాయంటే బాహుబలి జ్వరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అక్కడే కాదు దాదాపు అన్ని సెంటర్లలో పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. జిల్లా కేంద్రాల్లో మొదటి రోజు షోలన్నీ దాదాపు ఫుల్లే. రవితేజ మాస్ జాతర లాంటి కొత్త రిలీజ్ కాంపిటీషన్ లో ఉన్నా సరే జనం బాహుబలి ఎపిక్ కోసమే ఎగబడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మురారి, ఖుషి, పోకిరి లాంటి అతి కొన్ని రీ రిలీజులు మాత్రమే లాంగ్ రన్ దక్కించుకున్నాయి. ఈ లెక్కన బాహుబలి కనీసం రెండు వారాలు హోల్డ్ చేస్తుందని బయ్యర్లు నమ్ముతున్నారు. అదే జరిగితే ఎవరూ అందుకోలేని రికార్డులు నమోదవుతాయి.
మాస్ జాతర కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కొంచెం నెమ్మదించవచ్చేమో కానీ లేదంటే మాత్రం బాహుబలి ఎపిక్ సునామి సృష్టించడం ఖాయం. మరొక ముఖ్యమైన విషయం తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతుంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత స్పీడ్ మీద ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజమౌళి బృందం తెలివిగా కట్ చేసిన రెండు ట్రైలర్లు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి. ఆల్రెడీ వందలసార్లు చూసినా సినిమా అయినా మరోసారి బిగ్ స్క్రీన్ అనుభూతి దక్కించుకోవాలనే కోరిక కలిగించేలా మార్కెటింగ్ చేశారు. చూడాలి మరి బాహుబలి ఎపిక్ ఎవరూ అందుకోలేని ఏఏ రికార్డులు సృష్టించబోతోందో.
This post was last modified on October 29, 2025 1:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…