ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో మల్టీస్టారర్లు పెరుగుతాయనుకుంటే దానికి భిన్నంగా అంత స్పీడ్ అయితే కనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను రాజమౌళి అంతటి దిగ్గజం కాకుండా వేరొకరు అయితే బ్యాలన్స్ చేయలేరని భావించేమో ఎవరూ పెద్దగా రిస్క్ చేయలేదు. వాల్తేరు వీరయ్య లాంటి ఒకటి రెండు సినిమాలు వచ్చాయి కాని అధిక శాతం స్టార్లు సోలో సబ్జెక్టులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటరెస్టింగ్ కాంబోకి శ్రీకారం చుట్టబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. మాస్ మహారాజా రవితేజ, యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి కలయికలో ఒక క్రేజీ ఎంటర్ టైనర్ కి త్వరలోనే పునాది పడొచ్చని ఇన్ సైడ్ న్యూస్.
ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఇటీవలే ఈ ఇద్దరికీ నెరేషన్ ఇస్తే సింగల్ సిట్టింగ్ లోనే పాజిటివ్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. అయితే దర్శకుడు ఎవరనేది లాక్ కాలేదు. ఈ కాంబో మీద పెట్టుబడి అంటే టాప్ ప్రొడక్షన్ హౌసులే లైన్ లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు కానీ ముందైతే డైరెక్టర్ ని లాక్ చేసుకోవాలి. ప్రసన్న కుమార్ కు మొదటి నుంచి డైరెక్షన్ మీద మనసుంది. నా సామిరంగా తనే చేయాల్సింది కానీ చివరి నిమిషంలో వదులుకుని కేవలం స్క్రిప్ట్ మాత్రం ఇచ్చాడు. మరి ఇప్పుడు రవితేజ, నవీన్ కనక అంగీకారం తెలిపితే బహుశా ఇదే తన డైరెక్షన్ డెబ్యూ కావొచ్చు లేదా వేరొకరికి ఇవ్వొచ్చు.
ప్రస్తుతానికిది ఇంకా అనౌన్స్ మెంట్ స్టేజికి రాలేదు. ప్రాధమికంగా ఓకే అనుకున్నారు కానీ ఫైనల్ వెర్షన్ లాక్ అయితే తప్ప పూర్తి వివరాలు బయటికి రావు. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, ఇడియట్ చంటిగాడు కలిస్తే తెరమీద జరగబోయే అల్లరి మాములుగా ఉండదు. కాకపోతే వీళ్ళ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే టీమ్ కావాలి. రైటర్ గా మజాకాతో నిరాశ చెందిన ప్రసన్న కుమార్ ఈసారి రూటు మార్చి మంచి ఎంటర్ టైనర్ రాసుకున్నాడట. మాములుగా ఏదైనా కథని అంత సులభంగా ఒప్పుకోని నవీన్ పోలిశెట్టికి అంత ఫాస్ట్ గా నచ్చిందంటే విషయం పెద్దదే అయ్యుంటుంది. చూడాలి మరి ఎప్పుడు ఓకే అవుతుందో.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…