ఇంకో డెబ్భై రోజుల్లో 2026 సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి మొత్తం ఏడు సినిమాలు బరిలో ఉండే అవకాశాలు స్పష్టం కావడంతో థియేటర్ల సర్దుబాటు గురించి ఆల్రెడీ బయ్యర్ వర్గాల్లో టెన్షన్ మొదలైపోయింది. ఏడాది మొత్తంలో అతి పెద్ద రెవిన్యూ సీజన్ గా భావించే ఈ పండక్కు ఎంత పెద్ద హీరోల క్లాష్ ఉన్నా సరే యావరేజ్ కంటెంట్ తోనూ సూపర్ హిట్ వసూళ్లు కొల్లగొట్టొచ్చు. బ్లాక్ బస్టర్ కంటెంట్ పడితే మాత్రం కలెక్షన్ల సునామి ఉంటుంది. అయితే ఈసారి పోటీ మరీ తీవ్రంగా మారిపోవడం బిసి సెంటర్ల ఎగ్జిబిటర్లను తలలు పట్టుకునేలా చేస్తోంది. అదెలాగో మీరే చూడండి.
జనవరి 9 ప్రభాస్ ‘ది రాజా సాబ్’ దిగుతాడు. పాజిటివ్ టాక్ వచ్చిందా డార్లింగ్ చేయబోయే విధ్వంసం మాములుగా ఉండదు. అసలే మంచి వింటేజ్ వైబ్స్ తో ప్రమోషన్లు పీక్స్ కు చేరుకోబోతున్నాయి మూడు రోజులు ఆగి 12న చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ని తెస్తారని ఫిలిం నగర్ న్యూస్. ఆల్రెడీ ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు లాకైపోయారు. అడ్వాన్సులు కూడా ఇచ్చేశారట. థియేటర్ అగ్రిమెంట్లు ఏ క్షణమైనా మొదలవ్వొచ్చు. మరుసటి రోజు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, 14న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, చివరిలో శర్వానంద్ ‘నారీనారీ నడుమ మురారి’ని దించే ప్లానింగ్ లో నిర్మాతలున్నారు.
ఇవి చాలవన్నట్టు విజయ్ ‘జన నాయకుడు’ ఒకే రోజు రాజా సాబ్ తో క్లాష్ కానుండగా శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ని పొంగల్ బరిలో దింపే లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నారని చెన్నై టాక్. ప్రాక్టికల్ గా చూస్తే ఇంత పెద్ద క్లాష్ టాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా కొంచెం రిస్కే అవుతుంది. ఏపీ తెలంగాణలో సరిపడా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి కానీ కేవలం మూడు నాలుగు స్క్రీన్లు మాత్రమే ఆపరేషన్ లో ఉన్న కింది స్థాయి ఊళ్లు, బిసి సెంటర్లు చాలా ఉన్నాయి. వీటిలో అన్ని సినిమాలు రిలీజ్ చేయడం అసాధ్యం. పైగా ఆడియన్స్ కి ఆప్షన్లు ఎక్కువైపోతే ఓపెనింగ్స్ తో పాటు గ్రాసులు ప్రభావితం చెందుతాయి. మరి ఎవరికి వారు తగ్గమని భీష్మించుకు ఉంటారో లేదా ఒకరో ఇద్దరో వెనకడుగు వేస్తారో ఇంకొద్ది రోజుల్లో వేచి చూడాలి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…