కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో నడుస్తున్న రీ రిలీజ్ ట్రెండులో ఒకప్పుడు ఒక పీక్స్ చూడబోతున్నాం. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రను మార్చిన రాజమౌళి అండ్ కో.. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. ఇండియన్ సినిమాలో ఎన్నడూ లేని విధంగా రెండు భాగాలుగా విడుదలైన సినిమాను కలిపి ఒకటిగా విడుదల చేయబోతోంది. అదే.. బాహుబలి: ది ఎపిక్.
ఈ పని ఏదో మొక్కుబడిగా చేయకుండా ఒక కొత్త సినిమాకు పని చేసినట్లు కొన్ని వారాల పాటు రాజమౌళి బృందమంతా కలిసి ఎడిటింగ్ మీద కూర్చుంది. మూడు ముప్పావు గంటల నిడివితో ఈ చిత్రాన్ని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తేబోతోంది. ఆల్రెడీ యుఎస్ సహా పలు దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. స్పందన చాలా బాగుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఆరంభించారు. రెస్పాన్స్ అదిరిపోతోంది.
ఒక కొత్త సినిమా తరహాలో ‘బాహుబలి: ది ఎపిక్’కు 31న ఉదయం 8 గంటల నుంచే షోలు పడబోతున్నాయి. వాటి టికెట్ల కోసం డిమాండ్ కూడా గట్టిగానే ఉంది. బుకింగ్స్ ఓపెనైన కాసేపటికే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లోకి వచ్చేశాయి. కొన్ని షోలు ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయాయి కూడా. గంటకు 5 వేలకు ‘బాహుబలి: ది ఎపిక్’ టికెట్లు తెగుతున్నాయంటే ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థమవుతుంది.
నిన్ననే ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్ లాంచ్ చేశారు. దాని క్వాలిటీ మామూలుగా లేదు. తెలిసిన కథ.. చూసిన సినిమానే అయినా.. మళ్లీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచేలా కనిపిస్తోంది ‘బాహుబలి: ది ఎపిక్’. ఇండియాలో రీ రిలీజ్ రికార్డులన్నింటినీ ‘బాహుబలి’ బద్దలు కొట్టడం లాంఛనమే. ఫుల్ రన్లో ఈ చిత్రానికి వంద కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబట్టి ఎవ్వరూ అందుకోని రికార్డును నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on October 25, 2025 1:56 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…