‘వి’తో యాక్షన్ హీరోగా తనలో కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు సుధీర్ బాబు. కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి రూటు మార్చి ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే పీరియడ్ మూవీకి రెడీ అయిపోయాడు. ‘పలాస 1978’ సినిమాతో ఆకట్టుకున్న కొత్త దర్శకుడు కరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ మధ్యనే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఆ పోస్టర్లో సెటప్ అంతా చూస్తే ‘పలాస’ తరహాలోనే కరుణ్ కుమార్ మళ్లీ కాలంలో వెనక్కి వెళ్తున్నాడని స్పష్టమవుతోంది. జాతర జరిగే చోట సోడాలమ్ముతూ, ఎలక్ట్రీషియన్ పనులు చేసే కుర్రాడిగా సుధీర్ బాబు ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడు హీరోయిన్ ఎవరన్నది ప్రకటించలేదు. ఇంకా ఈ విషయంలో ప్రకటన ఏదీ రాలేదు.
ఐతే సుధీర్ సరసన ఓ ఆసక్తికర హీరోయిన్ను సెట్ చేసినట్లు సమాచారం. ఆ అమ్మాయే.. ఆనంది అలియాస్ రక్షిత. తెలుగమ్మాయే అయిన ఆనంది.. రక్షిత పేరుతో తెలుగులో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. ఆ తర్వాత ఆనందిగా పేరు మార్చుకుని తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి మంచి సినిమాలు చేసి కథానాయికగా ఓ స్థాయిని అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆల్రెడీ ‘జాంబీ రెడ్డి’ సినిమాలో ఆనంది కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ అమ్మాయికి ‘శ్రీదేవి సోడా సెంటర్’లో ఛాన్స్ దక్కింది. టైటిల్లో ఉన్న శ్రీదేవి అలనాటి అందాల తార శ్రీదేవినా, లేక హీరోయిన్ పేరు అదా అన్నది చూడాలి. కరుణ్ కుమార్ చాలా వరకు లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తాడని అతడి తొలి సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మంచి పెర్ఫామర్గా తమిళంలో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయిని అందుకే ఏరికోరి తన కొత్త సినిమాకు ఎంచుకున్నట్లున్నాడు. సుధీర్తో ‘భలే మంచి రోజు’ చిత్రాన్ని నిర్మించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.
This post was last modified on December 1, 2020 9:58 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…