Movie News

సోడా సెంటర్‌లో హీరోయిన్ ఈమేనా?

‘వి’తో యాక్షన్ హీరోగా తనలో కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు సుధీర్ బాబు. కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి రూటు మార్చి ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే పీరియడ్ మూవీకి రెడీ అయిపోయాడు. ‘పలాస 1978’ సినిమాతో ఆకట్టుకున్న కొత్త దర్శకుడు కరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ మధ్యనే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఆ పోస్టర్లో సెటప్ అంతా చూస్తే ‘పలాస’ తరహాలోనే కరుణ్ కుమార్ మళ్లీ కాలంలో వెనక్కి వెళ్తున్నాడని స్పష్టమవుతోంది. జాతర జరిగే చోట సోడాలమ్ముతూ, ఎలక్ట్రీషియన్ పనులు చేసే కుర్రాడిగా సుధీర్ బాబు ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడు హీరోయిన్ ఎవరన్నది ప్రకటించలేదు. ఇంకా ఈ విషయంలో ప్రకటన ఏదీ రాలేదు.

ఐతే సుధీర్ సరసన ఓ ఆసక్తికర హీరోయిన్‌ను సెట్ చేసినట్లు సమాచారం. ఆ అమ్మాయే.. ఆనంది అలియాస్ రక్షిత. తెలుగమ్మాయే అయిన ఆనంది.. రక్షిత పేరుతో తెలుగులో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. ఆ తర్వాత ఆనందిగా పేరు మార్చుకుని తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి మంచి సినిమాలు చేసి కథానాయికగా ఓ స్థాయిని అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆల్రెడీ ‘జాంబీ రెడ్డి’ సినిమాలో ఆనంది కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ అమ్మాయికి ‘శ్రీదేవి సోడా సెంటర్’లో ఛాన్స్ దక్కింది. టైటిల్లో ఉన్న శ్రీదేవి అలనాటి అందాల తార శ్రీదేవినా, లేక హీరోయిన్ పేరు అదా అన్నది చూడాలి. కరుణ్ కుమార్ చాలా వరకు లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తాడని అతడి తొలి సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మంచి పెర్ఫామర్‌గా తమిళంలో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయిని అందుకే ఏరికోరి తన కొత్త సినిమాకు ఎంచుకున్నట్లున్నాడు. సుధీర్‌తో ‘భలే మంచి రోజు’ చిత్రాన్ని నిర్మించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.

This post was last modified on December 1, 2020 9:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

13 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

30 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

4 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago