పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ఏళ్ల తర్వాత మంచి కిక్కు దొరికింది ‘ఓజీ’ మూవీతో. పవన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి వాళ్లకు పూనకాలు తెప్పించాడు యువ దర్శకుడు సుజీత్. పేరుకు పాన్ ఇండియా మూవీ కానీ.. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లన్నీ తెలుగు నుంచి వచ్చినవే. తెలుగు వెర్షన్తోనే ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ‘ఓజీ’.
ఐతే ఈ సినిమా గురించి కన్నడ దర్శక నిర్మాత చంద్రు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.
తనే డైరెక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసిన ‘కబ్జా’ సినిమా స్ఫూర్తితో ‘ఓజీ’ తీశారని అతను వ్యాఖ్యానించాడు. ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో ‘కబ్జా’ తీశాడు చంద్రు. ఐతే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అలాంటి సినిమాను చూసి ‘ఓజీ’ తీశారనడం ఆశ్చర్యం కలిగించే విషయం.
‘ఓజీ’ కథ కొత్తదేమీ కాదు. పూర్వాశ్రమంలో హీరో డాన్గా ఉండడం.. ఏదో కారణంతో అవన్నీ వదిలేసి సాత్వికుడిగా మారిపోవడం.. అత్యవసర పరిస్థితుల్లో తిరిగొచ్చి మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటడం ‘బాషా’ రోజుల నుంచి చూస్తూనే ఉన్నాయి. మరి కొత్తగా ‘కబ్జా’ సినిమా నుంచి ‘ఓజీ’కి స్ఫూర్తి పొందడం ఏముంది? నిజానికి ‘కబ్జా’ మూవీ మీదే కాపీ ముద్ర పడింది.
‘కేజీఎఫ్’ను చూసి వాత పెట్టుకున్నారని రిలీజ్ టైంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కథ నుంచి టేకింగ్ వరకు మొత్తంగా ‘కేజీఎఫ్’ స్టైల్ ఫాలో అయిపోయారు. సినిమా ఆడకపోవడానికి కూడా అదే కారణమైంది. ‘కబ్జా’ ఫ్లాప్ అయినప్పటికీ దానికి సీక్వెల్ తీయాలని ఆ పనులు కూడా మొదలుపెట్టాడు చంద్రు. కానీ అది వర్కవుట్ కాదని తర్వాత ఆపేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on October 23, 2025 9:12 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…