తన పాత సినిమాల పాటలు కొన్ని సెకన్ల పాటు ఏదైనా సినిమాలో వినిపించినా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అస్సలు ఊరుకోవడం లేదు. వెంటనే నోటీసులు ఇవ్వడం, కోర్టులో కేసులు వేయడం చేస్తున్నారు. గత కొన్నేళ్లలో మేస్ట్రో ఇలా పదుల సంఖ్యలో సినిమాలకు నోటీసులు పంపారు. కొన్ని చిత్రాల మేకర్స్ ఆయనకు నష్టపరిహారం కూడా అందించారు. ఈ ఏడాది తమిళంలో బ్లాక్బస్టర్ అయిన అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీంకు కూడా ఆయన నోటీసులు ఇవ్వడం తెలిసిందే.
ఈ చిత్రాన్ని నిర్మించింది తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఆ వివాదం గురించి తమ కొత్త సినిమా ‘డ్యూడ్’ ప్రెస్ మీట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడారు. తాము సోనీ ఆడియో సంస్థకు డబ్బులిచ్చే ఆయా పాటల హక్కులు తీసుకున్నామని.. ఇళయరాజా కేసు వేసింది సోనీ మీద అని, అది వేరే ఇష్యూ అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
కట్ చేస్తే ఇప్పుడు ‘డ్యూడ్’కూ ఇళయరాజా నుంచి ఇబ్బందులు తప్పట్లేదు. ఈ సినిమాలో తన పాటలు రెండు వాడారంటూ ఆయన టీంకు నోటీసులు పంపారు. ఈ సినిమాలో ఇళయరాజా పాటలను అక్కడక్కడా బ్యాగ్రౌండ్లో వాడారు. అవి కొన్ని సెకన్ల పాటే ఉంటాయి. అయినా ఆయన ఊరుకోవట్లేదు. తన మీద అభిమానంతో ఎవరైనా పాటలు వాడినా ఇళయరాజా నోటీసులు పంపుతున్నారు.
పాట మీద సంగీత దర్శకుడిదే తొలి హక్కు అని.. కానీ ఆడియో సంస్థలు నిర్మాతలకు డబ్బులిచ్చి హక్కులు తీసుకుని దశాబ్దాల తరబడి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నారని.. సంగీత దర్శకుడికి రాయల్టీ ఇవ్వట్లేదని.. ఇదేం న్యాయమని ఇళయరాజా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ సినిమాలో ఏ రకంగా తన పాటలను వాడుకున్నా ఆయన ఊరుకోవట్లేదు. ‘డ్యూడ్’కు కూడా అలాగే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on October 22, 2025 3:31 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…